తలసానిగురించి అడిగితే కవిత వినిపించిన అసెంబ్లీ స్పీకర్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకు ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులకు నిన్న ఒక విచిత్రమైన అనుభవం ఎదురయింది. టీడీపీ టిక్కెట్‌పై గెలిచి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా విషయంలో వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతూ వారు నిన్న స్పీకర్ మధుసూదనాచారిని కలిసిన సంగతి తెలిసిందే. అయితే చారిగారు ఆ విషయంపై మాట్లాడటానికి బదులు తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును గురించి ఎత్తుకున్నారట. అన్న ఎన్‌టీఆర్‌ను పొగడ్తలలో ముంచెత్తారు. ఆ మహనీయుడిపై తాను రాసిన కవితను టీడీపీ నేతలకు చదివి వినిపించారు. ఎన్‌టీఆర్ పేరులోని ప్రతి అక్షరాన్ని ఉదహరిస్తూ ఆ కవితను అక్షరబద్ధం చేసినట్లు తెలిపారు. పైగా ఎన్‌టీఆర్‌పై ఇంతకంటే బాగా మరెవరూ కవిత రాయలేరనికూడా చెప్పారంట. ఎవరైనా ఇంకా బాగా రాస్తే వారికి లక్షా వేయి నూట పదహార్లు బహుమతిగా ఇస్తాననికూడా అన్నారు. తాము వచ్చిన పనేమిటి, ఈ కవితల గొడవేమిటంటూ తెలుగుదేశం జుట్టు పీక్కున్నారట.

అసలు తెలుగుదేశం నేతలు వచ్చిన పని మర్చిపోయేటట్లు చేయటానికే ఈ కవిత డ్రామానా, లేక నిజంగానే తెలుగుదేశం వ్యవస్థాపకుడైన అన్న నందమూరిపై మధుసూదనాచారికి అంత అభిమానం ఉందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close