మాగుంట బెయిల్ రద్దు – అవినాష్‌కి…

వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలకు బెయిల్ టెన్షన్ పట్టి పీడిస్తోంది. ఓ ఎంపీ తన కుమారుడు బెయిల్ రద్దు అయిపోతుందేమోనని కంగారు పడిపోయారు. ఆయన భయానికి తగ్గట్లుగానే బెయిల్ రద్దు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవ తన అమ్మమ్మకు బాగో లేదని.. ఆమెను చూసుకోవాలని చెప్పి రెండు వారాల మధ్యంతర బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. అయితే ఈడీ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం బెయిల్ రద్దు చేసేసింది. పన్నెండో తేదీన సరెండర్ కావాలని ఆదేశించింది.

తాను లిక్కర్ స్కాంలో జైల్లో ఉంటే.. మాగుంట రాఘవ భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని ఆయన తరపు లాయర్లు కోర్టులో చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. మరో అవినాష్ రెడ్డికి మాత్రం ఇంకా బెయిల్ రద్దు టెన్షన్ కొనసాగుతోంది. వివేక హత్య కేసులో సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంది. దీనిపై మంగళవారం విచారణ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడంపై పిటిషన్ వేశారు సునీత.

వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన కుట్రదారుడని సుప్రీంకోర్టుకు తెలిపారు సునీత తరఫున న్యాయవాది. అలాంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పారు. మీడియాలో వచ్చిన స్టోరీలు ఆధారంగా హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. వివేకా హత్య కేసు విచారణకు అడుగడుగునా అవినాష్ రెడ్డి అడ్డుకుంటున్నారని వాదించారు సునీత తరఫున న్యాయవాది. స్థానిక ప్రభుత్వం కూడా ఆయనకు మద్దతు ఇస్తోందని అన్నారు. సీబీఐ విచారణ జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్‌్ 24 తర్వాత నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అవినాష్ రెడ్డి విచారణకు వెళ్లలేదని గుర్తు చేశారు. సునీత పిటిషన్‌ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ మంగళవారం చేపట్టబోతున్నట్టు వెల్లడించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close