బీజేపీతో కటీఫ్ చేసుకోవడానికి పిడిపి అందుకే భయపడుతోందా?

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ మరణించిన తరువాత, అంతవరకు బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం నడిపించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చింది. బీజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకి ఆ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కానీ వేరే గత్యంతరం లేకపోవడంతో బీజేపీకి షరతులు విధించి దానికి అంగీకరిస్తేనే బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెపుతున్నారు.

శ్రీనగర్ లో నిన్న పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడుతూ “రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయమని మనం కేంద్రప్రభుత్వాన్ని కోరాము. అందుకోసం మనకు నమ్మకం కలిగేవిధంగా కొన్ని రాజకీయ చర్యలు చేప్పట్టాలని కోరాము. ఆ చర్యల ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకి సానుకూల వాతావరణం కలుగుతుందని మనము సూచించాము. మనం రాజకీయ చర్యల గురించి అడుగుతుంటే కేంద్రప్రభుత్వం ఆర్ధిక అంశాల గురించి మాట్లాడుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమయిన వాతావరణం కల్పించే దిశలో నిర్దిష్టమయిన చర్యలు చేపట్టకుండా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే మనం ప్రస్తుత విధానాన్నే కొనసాగిస్తాము. ఎవరి ఒత్తిళ్ళకి లొంగే ప్రసక్తి లేదు,” అని చెప్పారు.

ఆమె చెప్పిన ప్రస్తుత విధానం అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కాలక్షేపం చేయడమే. అంటే ఆమె బీజేపీ మరికొంత గడువు ఇవ్వాలని భావిస్తున్నారనుకోవచ్చును. ఒకవేళ కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోయినట్లయితే తమకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆమె సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. కానీ దాని వలన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం కొరవడవచ్చును. పాకిస్తాన్ తో సరిహద్దు కలిగి నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కేంద్రం సహకారం లేకపోతే మనుగడ సాగించడం చాలా కష్టమవుతుంది. బహుశః అందుకే బీజేపీతో కటీఫ్ చెప్పడానికి పిడిపి వెనుకంజ వేస్తోందని చెప్పవచ్చును. కానీ ఇలాగే చేతులు ముడుచుకొని కూర్చొంటే, ఏదో ఒకరోజు పిడిపి ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోనో లేక బీజేపీలోనో చేరిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక మహబూబా ముఫ్తీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ బీజేపీని, కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు మాట్లాడుతున్నప్పటికీ, ఆమె కూడా కేంద్రప్రభుత్వం పిలుపు కోసం ఎదురుచూస్తున్నారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close