ఇంత‌కీ ‘మ‌హ‌ర్షి’ టికెట్టు రేట్లు పెరిగిన‌ట్టా? కాదా?

మ‌హ‌ర్షి సినిమా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్నీ గంద‌ర‌గోళంలో ప‌డేసింది. ఈ సినిమా టికెట్టు రేట్లు పెరిగిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. మ‌ల్టీప్లెక్స్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ టికెట్ రేటు 138 రూపాయ‌లు ఉంటే…. గురువారం నుంచి రెండు వారాల పాటు 200 రూపాయ‌ల‌కు పెంచారు. సింగిల్ స్క్రీన్‌లో కూడా టికెట్ రేటు మారింది. 80 రూపాయ‌ల టికెట్ 110 రూపాయ‌లు చేశారు. వంద రూపాయ‌ల టికెట్ ధ‌ర 125కి పెరిగింది. ధియేట‌ర్ యాజ‌మాన్యాలు కొత్త రేట్ల ప్ర‌కార‌మే టికెట్లు అమ్మేస్తున్నాయి. మ‌ల్టీప్లెక్స్‌లో అడ్వాన్సు బుకింగులు మొద‌లెట్టేశాయి. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం టికెట్టు రేటు పెంచుకోవ‌డానికి మేం ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని తేల్చి చెప్పేశాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితి మ‌రోలా ఉంది. అక్క‌డ క‌లెక్ట‌ర్లు ఉత్త‌ర్వులు ఇచ్చారంటూ చెప్పుకుంటూ.. అధిక ధ‌ర‌ల‌కు టికెట్ల‌ని అమ్మేస్తున్నారు. సింగిల్ స్క్రీన్‌లో 30 శాతం టికెట్ రేటు పెరిగితే మ‌ల్టీప్లెక్స్‌లో 40 శాతం వ‌ర‌కూ ఉంది. అయితే ఈ రేట్లు ఒక్కో థియేట‌ర్లో ఒక్కోలా ఉన్నాయి. కొన్ని థియేట‌ర్లు పెరిగిన రేట్లు వ‌సూలు చేస్తుంటే, ఇంకొన్ని పాత రేట్ల‌కే క‌ట్టుబ‌డి ఉన్నాయి. ఈ విష‌యంలో చిత్ర‌బృందం ఒక‌లా, ప్ర‌భుత్వాలు మ‌రోలా మాట్లాడ‌డం గంద‌ర‌గోళానికి గురి చేసే విష‌యం. ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ని పెంచుకోవ‌డానికి మాకు అనుమ‌తి ఇచ్చిందంటూ చిత్ర‌బృందం చెబుతోంది. కోర్టు ఉత్త‌ర్వుల‌నీ చూపిస్తోంది. స్వ‌యంగా… తెలంగాణ రాష్ట్ర మంతి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ రంగంలోకి దిగి… అస‌లు మేం అలాంటి ఉత్త‌ర్వులే ఇవ్వ‌లేదంటోంది. ఆంధ్ర‌లో క‌లెక్ట‌ర్లు టికెట్ ధ‌ర‌ని పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చారంటున్నాయి. కానీ.. అలాంటి ఆధారాలేం చూపించ‌డం లేదు. ఈ విష‌యంలో రేప‌టికి గానీ ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు. అయితే ఇప్ప‌టికే బుక్ మై షో ద్వారా టికెట్ల‌ని కొన్న‌వాళ్లు మాత్రం ఎక్కువ ధ‌ర చెల్లించి మ‌హ‌ర్షి టికెట్లు కొన్న‌ట్టైంది. ఒక‌వేళ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేద‌ని తెలిస్తే… వాళ్ల‌కు డ‌బ్బులు రిఫండ్ వ‌స్తాయా, రాదా? అనేది మ‌రో పెద్ద ప్ర‌శ్న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close