మహేష్ కూడా సర్‌ప్రయిజ్ గిఫ్ట్ లు ఇస్తున్నాడే..!

సూపర్ స్టార్ మహేష్ ఇదివరకు అసలు మీడియా ముందుకు రావడానికి చాలా ఆలోచించే వారు.. ఇప్పుడు తరచు మీడియాలో ప్రత్యక్షమవుతూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. ఈ మధ్యనే శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మారిన మహేష్ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నాడు. ఆ దారిలోనే దీపావళి సందర్భంగా సిని ప్రముఖుల్లో కొంతమందికి సర్‌ప్రయిజ్ గిఫ్ట్ లు పంపించి షాక్ ఇచ్చాడట. ఈ దీపావళికి లక్సరీయస్ రేంజరోవర్ కార్ ను తీసుకున్నాడు మహేష్.

అంతేకాదు కొన్ని డ్రై ఫ్రూట్స్, క్రాకర్స్, స్నాక్స్, ఆర్గానికి మ్యాంగోస్ లాంటివి ప్యాక్ చేయించి కొంతమందికి గిఫ్ట్ గా పంపించాడు. ఈ లిస్ట్ లో కంచె సినిమా దర్శకుడు క్రిష్ కూడా ఉండటం విశేషం. క్రిష్ అందుకున్న మహేష్ సర్‌ప్రయిజ్ గిఫ్ట్ లకు సంబరపడుతూ వారికి కృతజ్ఞత తెలుపుతూ ట్వీట్టర్లో థాంక్స్ మెసేజ్ పోస్ట్ చేశాడు. మహేష్, నమ్రతలు కలిసి ప్లాన్ చేసిన ఈ సర్‌ప్రయిజ్ గిఫ్ట్ కేవలం క్రిష్ ఒక్కడికేనా ఇంకా ఎవరెవరికి పంపించి ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.

మొన్నటిదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫాం హౌజ్ లో పండిన మామిడి పండ్లను తనకు నచ్చిన వారికి పంపించినట్టు ఇప్పుడు మహేష్ కూడా సర్‌ప్రయిజ్ గిఫ్ట్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. తోటి సిని ప్రముఖులను ఇలా సర్‌ప్రయిజ్ గిఫ్టులతో షాక్ ఇస్తున్న మహేష్ ఆ గిఫ్ట్ లో దీపావళి విశెష్ ని చేతిరాతతో తెలుపుతూ ఓ కార్డ్ కూడా పంపడం విశేషం. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత మురుగదాస్ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close