త్రివిక్ర‌మ్ పై అంత న‌మ్మ‌కం ఏమిటి?

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. అన్నీ అనుకొన్న‌ట్టు జ‌రిగితే… ఇప్ప‌టికి స‌గం సినిమా పూర్త‌య్యేది. కానీ.. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. న‌వంబ‌రులో షూటింగ్ మొద‌లుపెడ‌దామ‌నుకొంటే… మ‌హేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకొంది. కృష్ణ ఆక‌స్మిక మ‌ర‌ణంతో.. మ‌హేష్ ఇంకొన్నాళ్లు షూటింగ్ కి దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. డిసెంబ‌రులో ఎట్టిప‌రిస్థితుల్లోనూ కొత్త షెడ్యూల్ మొద‌లు పెట్టాల‌న్న‌ది త్రివిక్ర‌మ్ ప్లాన్‌. మ‌హేష్ కూడా అదే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. అంతే కాదు.. ఈ సినిమాని 2023 ఏప్రిల్ లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ కూడా చేస్తున్నార్ట‌.

అంటే..ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో నాటికి షూటింగ్ అవ్వాలి. మార్చిలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో పాటుగా, ప్ర‌మోష‌న్ల కార్య‌క్ర‌మం పూర్త‌వ్వాలి. మూడు నెల‌ల్లో సినిమాని లాగించేయ‌డం ఓకే. కాక‌పోతే… త్రివిక్ర‌మ్ అంత ఫాస్ట్ కాదు. పైగా… పెద్ద కాంబినేష‌న్ ఇది. అంద‌రి కాల్షీట్లూ స‌ర్దుబాటు కావాలి. మ‌ధ్య‌లో ఎలాంటి అవాంత‌రాలూ రాకూడ‌దు. వేస‌విలో షూటింగ్ చేయ‌డానికి మ‌హేష్‌కి మ‌న‌సొప్ప‌దు. ఏప్రిల్ లో ఎండ‌లు మొద‌లైపోతాయి కాబ‌ట్టి… మార్చిలోపే షూటింగ్ ముగించాల‌ని, ఏప్రిల్ లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ సినిమా విడుద‌ల కావాల‌ని మ‌హేష్ ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ కాస్త స్లో. మ‌హేష్ కూడా మ‌ధ్య‌మ‌ధ్య‌లో గ్యాప్ లు ఎక్కువ‌గా తీసుకొంటుంటాడు. మ‌రి ఏ న‌మ్మ‌కంతో.. ఏప్రిల్ లో ఈ సినిమాని విడుద‌ల చేయాల‌నుకొంటున్నారో వాళ్ల‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close