మహా పుష్కరాలలో మహా విషాదం: 27 మంది మృతి

హైదరాబాద్: మహాపుష్కరాల ప్రారంభంరోజే మహా విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలో ఇవాళ ప్రారంభమైన గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తటంతో కోటగుమ్మం పుష్కరఘాట్‍‌వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించారు. మృతులలో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. వీరందరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారుగా చెబుతున్నారు. మరో 15మంది గాయాలపాలయ్యారు. వీరి పరిస్థితి సురక్షితమేనని అధికారులు చెబుతున్నారు. దుర్ఘటన జరిగిన ఘాట్ పేరు ‘పుష్కర’ ఘాట్ కావటంతో దూరప్రాంతాల యాత్రికులు రాజమండ్రిలో దిగగానే నేరుగా ఈ ఘాట్‌కే వెళ్ళారు. బయటకు వచ్చే మార్గాలు ఇరుకుగా వుండటంతో లోపల రద్దీ పెరిగిపోయింది. బయటపడటానికి ఒకరినొకరుతోసుకోవడంతో పరిస్ధితి విషమించింది.

ఈ దుర్ఘటనకు అధికారులు, పోలీసుల వైఫల్యమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించటానికి వందల ఘాట్‌లు ఉన్నప్పటికీ ఆ ఘాట్‌లపైన అధికారులు అవగాహన కల్పించకపోవటమే దుర్ఘటనకు కారణమన్న వాదన వినిపిస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబంతోసహా పుణ్యస్నానాలాచరించటంకోసం మూడుగంటలపాటు సామాన్య భక్తులందరినీ ఆపేశారని స్థానికులు ఆరోపించారు. ఈ 12 రోజులలో ఎప్పుడు స్నానంచేసినా ఒకటేనని, భక్తులు తొందరపడొద్దని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా కంట్రోల్‌రూమ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తొక్కిసలాట దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా పటిష్ఠ ఏర్పాట్లు చేశామని, ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావటంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రు.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గత కొద్దినెలలుగా పుష్కరాలపైన ఎంతో హడావుడి చేసిన ఏపీ ప్రభుత్వం, ఇవాళ్టి సంఘటనతో పెద్ద మచ్చను మూటగట్టుకున్నట్లయింది. ప్రతిపక్షాలు రేపటినుంచి ఈ ఘటనకుగానూ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close