జగన్ వాదన సబబేనా?

రాజమండ్రి పుష్కరాలలో ఈరోజు ఉదయం జరిగిన త్రొక్కిసలాటలో చనిపోయిన వారి సంఖ్య 35 కి చేరుకొంది. ఇది ఎవరికయినా చాలా బాధ కలిగించే విషయమే. చంద్రబాబు వి.ఐ.పి.ఘాట్ లో పుష్కర స్నానం చేసి ఉంటే, ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదని జగన్ ఆరోపించారు. ప్రచారం కోసమే చంద్రబాబు సామాన్య ప్రజలు స్నానం చేసే కోటగుమ్మం ఘాట్ లో స్నానాలు చేసారని, ఆ కారణంగా రెండు గంటలపాటు అన్ని గేట్లు మూసివేయడంతో బయట క్యూ లైన్లలో విపరీతంగా జనాలు పెరిగిపోయారని, వారిలో ఎవరయినా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకొన్నా వీలులేకపోయిందని అన్నారు.

చంద్రబాబు కుటుంబ సభ్యులు స్నానాలు ముగించుకొన్న తరువాత గేట్లు తీయగానే ఒక్కసారిగా త్రొక్కిసలాట మొదలవడంతో ముందు వరసల్లో ఉన్నవారు క్రిందనపడి మరణించారని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పుష్కరాల ఖ్యాతి మొత్తం తనకే దక్కాలనే యావతోనే చంద్రబాబు దేవాదాయ శాఖామంత్రి మాణిక్యరావుని సైతం పక్కనబెట్టి అన్నీ తానై నిర్వహించాలని చూసారని, కనుక ఈ అపకీర్తినీ ఆయనే స్వీకరించాలని, అదేవిధంగా మృతుల మరణానికి కూడా ఆయనే పూర్తి బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేసి కాశీ వెళ్లి గంగలో మునిగి తన తప్పులకు ప్రాయశ్చితం చేసుకోవాలని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను రాజకీయాలకు అతీతంగా చూసినట్లయితే చంద్రబాబు సామాన్య ప్రజలు స్నానాలు చేసే ఘాట్ లో స్నానం చేయడం, అందుకోసం ప్రజలను వేచి చూసేలా చేయడం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టం అవుతోంది. అందుకు చంద్రబాబు బాధ్యత వహిస్తారా లేదా? అనేది వేరే విషయం. కానీ గత నెల రోజులుగా ఆయన ఈ పుష్కరాలను చాలా గొప్పగా నిర్వహించాలని ఆయన చాలా తపన పడుతున్నారనే విషయం కూడా విస్మరించరాదు. ఒక కార్యక్రమాన్ని ప్రణాళికా బద్దంగా, నిర్విఘ్నంగా, దిగ్విజయంగా పూర్తి చేయాలని భావించడం కార్యసాధకుల లక్షణం. చంద్రబాబు నాయుడు కూడా అలాగే ఆలోచించి ఉండవచ్చును. ఆ ప్రయత్నంలో ఈ ఖ్యాతి అంతా తనకే దక్కాలని ఆయన అనుకొని ఉండవచ్చును. కానీ అదేమీ నేరం కాదు. కానీ ఆయన కీర్తిని కోరుకొన్నందుకు ఇటువంటి అపకీర్తి మూటగట్టుకోవలసివచ్చింది.

ఏ ముఖ్యమంత్రి కూడా తన ప్రజలు మరణిస్తే బాధపడకుండా ఉండలేరు. చంద్రబాబు నాయుడు కూడా చాలా బాధపడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఇటువంటి సంఘటన జరగడం ఆయనకి బాధ కలిగించింది. ఈ దుర్ఘటన మాయని మచ్చలా మిగిలిపోతుందని ఆయనకి కూడా తెలుసు. కానీ దుర్ఘటన జరిగిపోయిన తరువాత మళ్ళీ అటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇద్దరూ కూడా తమ అభిమానులని ఈ పుష్కర సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే విధంగా రాజకీయ పార్టీలు వాటి అధినేతలు ఇటువంటి కీలక సమయంలో దీనిపై రాజకీయాలు చేసి ప్రజలలో మరింత ఆందోళన కలిగించే బదులు, తమ తమ పార్టీల నేతలని, కార్యకర్తలని ఈ పుష్కరాలు సజావుగా సాగేందుకు సహకరిస్తే అందరూ హర్షిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close