మోడీ – అడవి – ఓ సాహసం..! ఇదీ కథ..!

ఎన్నికలకు ముందు కశ్మీర్‌లో పుల్వామా దాడి జరిగింది. ఆ విషయం తెలిసినా.. ప్రధానమంత్రి మోడీ.. డాక్యుమెంటరీ షూటింగ్‌లో పాల్గొన్నారంటూ.. అప్పట్లో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం కూడా రేగింది. కానీ దీన్ని బీజేపీ నేతలు తోసిపుచ్చారు. చివరికి ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రసారం కాబోతోంది. నిజానికి అది డాక్యుమెంటరీ కాదు… రియాలిటీ షో.. దాని పేరు “మ్యాన్ వర్సెస్ వైల్డ్”. అడవిలో తప్పిపోతే ఎలా బతకాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం తినాలి.. ఎలా ఉండాలి.. ఇదే కాన్సెప్ట్‌తో ఈ రియాల్టీ షో రూపొందుతోంది. దీన్ని డిస్కవరీ చానల్ ఆగస్టు 12వ తేదీన ప్రసారం చేయబోతోంది.

మోడీ .. అడవిలో చేసే రియాలిటీ షో విన్యాసాలతో డిస్కవరీ చానల్ ప్రోమో విడుదల చేసింది. క్షణాల్లో ఇది వైరల్ అయిపోయింది. “మ్యాన్ వర్సెస్ వైల్డ్” షోను.. బేర్ గ్రిల్స్ అనే స్టార్ హోస్ట్ నిర్వహిస్తూంటారు. ఆయన మోడీని మరో కోణంలో ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో ఈ ఎపిసోడ్‌ షూటింగ్‌ జరిగింది. చాలాకాలం అడవులు, పర్వతాల్లో గడిపానని.. తన జీవితంపై వాటి ప్రభావం చాలా ఉందని మోడీ అప్పుడప్పుడూ చెబుతూంటారు. ఇప్పుడు రియాలిటీలో షో ఆ అనుభవాన్ని ఉపయోగించుకున్నారు. బేర్ గ్రిల్స్ చాలా మంది దేశాధ్యక్షులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. 2015లో అమెరికా అధ్యక్షునిగా ఉన్న ఒబామాతోనూ ఎసిసోడ్‌ చేశారు.

మోడీ రియాలిటీ షో టీజర్ సూపర్‌గా ఉందన్న ప్రచారం సంగతేమో కానీ.. పుల్వామాలో సైనికులపై దాడి జరిగిన ఫిబ్రవరి 14 రోజునే .. మోదీ ఈ షూట్‌లో పాల్గొన్నారని విమర్శలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాడి జరిగి 44మంది సైనికులు చనిపోయిన విషయం తెలిశాక కూడా మోదీ షూటింగ్ కొనసాగించారా అని ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు… సోషల్ మీడియా ఎన్ని విమర్శలు చేసినా.. అవి లెక్కలోకి రావు. మోడీ సాహసమే.. దేశ సాహసం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close