రైతులొద్దు దీపికనే ముద్దు..!

దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం ఎవరికైనా తెలుసా..? ఆ ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్న విషయంపై అంచనా ఉందా..? మీడియాలోనే కాదు..సోషల్ మీడియాలోనూ ఆ విషయం ఎందుకు బయటకు రావడం లేదు..?. ఎందుకో చెప్పడం.. పెద్ద పజిల్ ఏమీ కాదు. రైతుల ఆందోళల్ని మినిమైజ్ చేయడానికి కేంద్రం చేయాల్సిందంతా చేస్తోంది. అందులో భాగంగా.. కనిపించని కట్టడి అమలవుతోంది. అదే సమయంలో.. ఘనత వహించిన మీడియాకు ఇబ్బంది లేకుండా.. టీఆర్‌పీ రేసు కూడా పెట్టింది. అదే..  హీరోయిన్లపై డ్రగ్స్ కేసు ఆరోపణలు. సుశాంత్ ఆత్మహత్య కేసు పూర్తిగా డ్రగ్స్ కేసుగా మారిపోయిన సమయంలో..హీరోయిన్లు టార్గెట‌్ అయ్యారు. వరుసగా వారికి నోటీసులు పంపుతున్నారు.

దీపికా పదుకొనే లాంటి హీరోయిన్‌కు నోటీసులు ఇచ్చారు. ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆమె విచారణకు హాజరైనా విషయమే.. హాజరు కాకపోయినా రచ్చే.. మీడియా ఎజెండా ఇలా ఉంటుంది. అదే ప్రకారం కవరేజీ సాగుతుంది. రోజంతా అదే ఉంటుంది. అందులో సందేహం ఉండదు. ఇవాళ దీపిక.. రేపు సారా.. ఆ తర్వాత శ్రద్ధాకపూర్..రకుల్.. ఇలా వాటి సీరియల్ నడుస్తూనే ఉంటుంది. మీడియా టీఆర్పీల పంట పండించుకుటూనే ఉంటుంది. కానీ.. దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న రైతుల అజెండా మాత్రం.. ఎవరికీ కనిపించదు.. ఏ మీడియాలోనూ రాదు. చివరికి ఆ సెలబ్రిటీలు తప్పు చేసినట్లు ఆధారాలతో దొరికినా వారికి కూడా ఏమీ కాదు. కాకపోతే.. వారి ఇమేజ్ కొన్ని రోజులు .. రైతుల ఆందోళనలు కనిపించకుండా కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని కేంద్రం ఏ మాత్రం నివృతి చేయడం లేదు. కనీస మద్దతు ధర పెంచుతామని.. ఎరువుల సబ్సిడీని నేరుగా బ్యాంకులో వేస్తామని… తాయిలాలు ప్రకటిస్తోంది. కానీ.. తమ సాగు కార్పొరేట్ గుప్పిట్లోకి పోదు అనే  భయాన్ని మాత్రం తీసేయడానికి ప్రభుత్వం సంకల్పించడం లేదు.  ఇప్పటి వరకూ పంజాబ్, హర్యానాల్లో ఉద్ధృతంగా ఉన్న రైతు ఉద్యమం ఇప్పుడు… ఉత్తరాది రాష్ట్రాలన్నింటికీ పాకుతోంది. ఆ తర్వాత దక్షిణాదికి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇందులో మీడియా..సోషల్ మీడియా పాత్ర ఉండదు. కానీ రైతుల ఆవేదన ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close