బిగ్ బ్రేకింగ్‌: ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌న్నుమూత‌

ఓ గానం ఆగింది. సంగీత ప్ర‌పంచాన్ని విషాద సాగ‌రంలో ముంచుతూ ఓ పాట అస్త‌మించింది. దిగ్గ‌జ‌ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (74) తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం క‌రోనాతో బాధ‌ప‌డుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరిన బాలు.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శాశ్వ‌త నిద్ర‌లోకి జారుకున్నారు. బాలు మ‌ర‌ణంతో – సంగీత ప్ర‌పంచం ఓ అద్భుత గాయ‌కుడ్ని కోల్పోయిన‌ట్టైంది. తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ ఇలా.. భాష‌తో పని లేకుండా సంగీత ప్ర‌పంచాన్ని, శ్రోత‌ల‌నూ త‌న గాత్రంతో ఓల‌లాడించిన బాలు.. దాదాపు 40 వేల‌కు పైగానే పాట‌లు పాడారు. దాదాపు మూడు ద‌శాబ్దాలు అలుపు లేకుండా పాడుతూనే ఉన్నారు. పాడుతా తీయ‌గా కార్య‌క్ర‌మం ద్వారా ఎన్నో కొత్త గ‌ళాల్ని వెలుగులోకి తెచ్చారు. బాలు కృషికి 2001లో ప‌ద్మ‌శ్రీ వ‌రించింది. 2011లో ప‌ద్మ‌భూష‌ణ్ సైతం అందుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇచ్చే నంది అవార్డుల్ని ఏకంగా 25 సార్లు అందుకున్నారు.

బాలు పూర్తి పేరు పండితారాధ్యుల బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేట‌మ్మ‌పేట‌లో జ‌న్మించారు. తండ్రి సాంబ‌మూర్తి, తల్లి శంకుత‌ల‌మ్మ‌. తండ్రి హ‌రి క‌థా క‌ళాకారుడు. అందుకే పాడ‌డం ఇంట్లోనే ఉంది. తండ్రిని చూస్తూ… బాలు కూడా పాడ‌డం మొద‌లెట్టారు. ఇంజ‌నీరింగ్ చ‌దువుతూ.. వేదిక‌ల‌పై పాట‌లు పాడడం మొద‌లెట్టారు. 1966లో `మ‌ర్యాద‌రామన్న‌` సినిమాతో తొలిసారి గాయ‌కుడి అవ‌తారం ఎత్తారు. అప్ప‌టి నుంచి.. ఆయ‌న వెను దిరిగి చూసుకునే అవ‌కాశ‌మే రాలేదు. క‌థానాయ‌కుడి శైలిని, గొంతునీ అనుస‌రిస్తూ పాట‌లు పాడ‌డం బాలు ప్ర‌త్యేక‌త‌. కృష్ణ‌, అక్కినేని, చిరంజీవి, బాల‌కృష్ణ‌.. ఎవ‌రికి పాట పాడుతున్నారో గ్ర‌హించి – దానికి త‌గ్గ‌ట్టు త‌న గొంతు మార్చుకునేవారు.

న‌ట‌న బాలుకి మంచి హాబీ. చాలా చిత్రాల్లో కీల‌క‌మైన పాత్ర‌లు పోషించి అల‌రించారు. ప్రేమ‌, ప్రేమికుడు, ప‌విత్ర‌బంధం, ఆరోప్రాణం, ర‌క్ష‌కుడు, దీర్ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌, మిథునం లాంటి చిత్రాలు బాలులోని న‌టుడ్ని వెండి తెర‌పై సాక్ష్యాత్క‌రింప‌జేశాయి. డ‌బ్బింగ్ క‌ళాకారుడిగానూ బాలు ఖ్యాతి గ‌డించారు. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ ల‌కు గాత్ర‌దానం చేశారు. దాదాపు 40 చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోదండ‌పాణి కి గురు స్థానం ఇచ్చారు బాలు. అందుకే త‌న ఆడియో ల్యాబ్‌కి `కోదండ‌పాణి ఆడియో ల్యాబ్‌` అని పేరు పెట్టుకున్నారు. బాలు అర్థాంగి సావిత్రి. వీరిద్ద‌రికీ ఇద్ద‌రు పిల్ల‌లు. అందులో ఎస్‌.పి.చ‌ర‌ణ్ గాయ‌కుడిగా, నిర్మాత‌గా చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మే. చెల్లాయి ఎస్‌.పి. శైల‌జ గాయ‌నిగా, డ‌బ్బింగ్ క‌ళాకారిణిగా రాణించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close