నమ్రత విషయంలో మీడియా తొందరపడిందా ?

సోషల్ మీడియా వచ్చిన తర్వాత వార్త వైరస్ కంటే వేగంగా వ్యాపించేస్తుంది. ఏదైనా సంఘటన జరిగితే చాలు.. పూర్తి వివరాలు తెలుసుకోకుండానే వార్తలు ఇచ్చేయడం అలావాటైపోయింది. ఇది ఎంత దారుణంగా తయారైయిందంటే .. కొంచెం ప్రామాణికత వున్న ఏ ఛానల్ లేదా న్యూస్ పేపర్.. ఓ చిన్న స్క్రోలింగ్ రాస్తే చాలు .. ఇంక అదే శాసనం అన్నట్టు వార్తలు వండేస్తున్నారు. నిన్న కీరవాణి వార్తే తీసుకోండి. ఒక వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ఆయన ఓ వీడియో చేశారు. దాన్ని చూసిన ఓ పేరున్న వార్త సంస్థ .. కీరవాణి ఆ వ్యాధితో బాధపడుతున్నారని రాసింది. సమాచారాన్ని అర్ధం చేసుకోవడంలోనే పప్పులో కాలేసింది ఆ వార్త సంస్థ. అయితే ఆ సంస్థ ఇస్తే నిజమే అయ్యింటుదని మిగతా చాలా ఛానల్స్, డిజిటల్ మీడియా పోర్టల్స్ ఆ తప్పుడు వార్తనే ఫాలో అయిపోయాయి.

నమ్రత విషయంలో కూడా ఇదే ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది. బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు ఓ కుదుపు కుదిపేస్తుంది. చాలా మందిపేర్లు బయటకి వచ్చాయి. కొన్ని అధికారులు చెప్పినవి .. ఇంకొన్ని మీడియా చెప్పినవి. నిన్న నమ్రత పేరు కూడా వచ్చేసింది. నేషనల్ వైడ్ గా ఓ పేరున్న ఓ ఛానల్ ఈ కేసులో ‘N’కూడా వుంది. N అంటే నమ్రత. ఆమె కూడా డ్రగ్స్ డీలర్స్ తో మాట్లడింది. దీనిపై అధికారులు సమాచారం వుంది అన్నట్లు ఓ వార్త ఇచ్చింది. ఈ లైన్ ని పట్టుకొని దాదాపు అన్ని తెలుగు ఛానల్స్ హడావిడి చేసేశాయి. ఎవరి దగ్గర పూర్తి సమాచారం లేదు. ఒకటే పాయింట్ .. డ్రగ్స్ కేసులో నమ్రత పేరు. అంతే. పాపం .. జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. సమాచారం మాత్రం లేదు. ఇదొక్కటే కాదు.. చాలా విషయాల్లో మీడియా పద్దతి ఇలానే వుంది. బురద చల్లేసి రిన్ షొప్ ఇచ్చే టైపులో మీడియా వ్యవహరించడం కొంతమంది మీడియాలో వుండే జనాలకే నచ్చడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close