ఏపిలో రూ.85,350 కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి హామీ

ఈరోజు విజయవాడలోని బెంజి సర్కిల్ మరియు దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్లకు శంఖుస్థాపన చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారి, ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “విజయవాడ చుట్టూ 180 కిమీ పొడవుగల ఒక ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. దానికి సుమారు రూ. 20,000 కోట్లు ఖర్చవుతుంది. అలాగే రాష్ట్రంలో కొత్తగా 1,350 కిమీ జాతీయ రహదారులను నిర్మించాలని కోరారు. దానికి రూ. 65,000 కోట్లు ఖర్చవుతుంది. అలాగే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా కేంద్రప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేస్తోంది. ఈ ప్రతిపాదనలన్నిటికీ నేను ఆమోదం తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేసుకోవాలని తపిస్తున్నారు. పైగా ఆయన మా ప్రభుత్వానికి చాలా మంచి స్నేహితుడు. అందుకే ఆయన ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులన్నీ నేను తక్షణమే ఆమోదిస్తున్నాను. హైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక పంపి, అది కేంద్రప్రభుత్వం ఆమోదించేలోగా రాష్ట్రంలో భూసేకరణ కార్యక్రమం పూర్తి చేసినట్లయితే మేము వచ్చే ఏడాది డిశంబర్ నుండి జాతీయ రహదారుల నిర్మాణం మొదలుపెట్టగలము,” అని గడ్కారీ అన్నారు.

ఈరోజు గడ్కారీ ప్రకటించినవన్నీ కలిపి చూసినట్లయితే మొత్తం రూ.85, 350 కోట్లు అయ్యింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి నేటి వరకు రాష్ట్రానికి ఒకేసారి ఇంత భారీగా నిధులు మంజూరు చేయలేదు. ఇంకా అనేక ప్రాజెక్టులకు, ముఖ్యంగా అమరావతి నిర్మాణం, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం మున్ముందు చాలా భారీ మొత్తాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు హైలైట్ చేసుకోగలిగితే బీజేపీ పట్ల ప్రజలలో నెలకొన్న అపోహలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చ గొట్టినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయమనం కోల్పోకుండా కేంద్రంతో మంచిగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు సాధించుకోగలుగుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి గల వ్యక్తి…మాకు చాలా మంచి స్నేహితుడని చెప్పడానికి కారణం అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close