అది మోడీ ఇచ్చిన భారీ నజరానా !

అమరావతి శంకుస్థాపన నాడు ఏపీకి ఏమీ ప్రకటించుకుండానే వెళ్లిపోయారని ప్రధాని మోడీపై విమర్శలు వచ్చాయి. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు, ప్యాకేజీ ఊసేలేదని ప్రతిపక్షాలే కాదు, స్వయంగా బీజేపీ నాయకులే నిరాశ చెందారు. చంద్రబాబు పరిస్థితి అయితే మరీ బాధాకరం. భారీగా ఖర్చు పెట్టి నభూతో అన్న విధంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఉసూరుమనిపించారు మోడీ. ఇదీ ఏపీలో అత్యధికుల అభిప్రాయం.

నిజానికి మోడీ చాలా ఇచ్చారు. తరచి చూస్తే తత్వం బోధపడుతుంది. రెండేళ్లుగా పెద్దగా జనంలోకి చొచ్చుకుపోలేక నామ్ కే వాస్తేగా మారిన కాంగ్రెస్ పార్టీకి, ఊపు తేవడానికి… అనుకోకుండానే ఓ అస్త్రాన్నిచ్చారు. మట్టి సత్యాగ్రహం పేరుతో ఊరూ వాడా కేడర్ ను ఉత్సాహ పరిచి, ఉద్రేక పరిచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి సువర్ణావకాశం ఇచ్చారు. మొన్న లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వలస యాత్ర జరిగింది. చివరకు కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు యాత్ర అవసరమనే పరిస్థితి వచ్చింది.

ఇప్పుడు మళ్లీ పుంజుకోవాలంటే కేడర్ ను బిజీగా ఉంచాలి. ఏదో ఒక కార్యక్రమం అప్పగించాలి. అందుకు మట్టి సత్యాగ్రహం మహా ప్రసాదంగా దొరికింది. మోడీకి వ్యతిరేకంగా ఆందోళన పేరుతో వాడవాడలా ఊరేగింపులు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు జోరుగా జరుగుతాయి. కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ కేడర్ కు, లీడర్లకు చేతినిండా పని. ఆ విధంగా పరోక్షంగా మోడీ చాలానే ఇచ్చారని కాంగ్రెస్ వారు ఖుషీగానే ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత దూకుడుగా జనంలోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవడానికి సరైన ఊతం దొరికినందుకు వాళ్లంతా సంబరపడుతున్నారు.

వైసీపీ సైతం ఈ పరిణామంతో దూకుడును పెంచింది. అయితే మోడీకంటే చంద్రబాబును ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ వలె మోడీ ప్రభుత్వంపై వైసీపీ అంత కటువుగా ఆరోపణలు చేయదు. అందుకు జగన్ కు ఉన్న కారణాలు వేరే కావచ్చు. కానీ చంద్రబాబు మీద వీలైనంత దుమ్మెత్తి పోయడానికి అవకాశం దొరికింది. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ రాలేదంటూ బాబుమీద విరుచుకు పడటమే పనిగా పెట్టుకోవడానికి, ఫ్యాన్ గాలిని పెంచడానికి ఇది ఉపయోపడుతుంది. మోడీ ఒక్క ప్రకటన చేసి ఉంటే కాంగ్రెస్ కు, వైసీపీకి ఈ అవకాశం లభించి ఉండేది కాదని టీడీపీ వారు బాధపడిపోతున్నారు. ఇంతకీ ఏపీకి ప్యాకేజీని మోడీ ఎప్పుడు ప్రకటిస్తారు? ప్రకటించకుండా ఉండటం సాధ్యం కాదని, కాబట్టి త్వరలోనే అది జరుగుతుందని బీజేపీ వారు చెప్తున్నారు. ఈలోగా ఈ ఆలస్యాన్నే అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు ధర్నాలు నిరసనలతో కేడర్ లో జోష్ పెంచుకుంటాయి. అదీ రాజకీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close