కేంద్ర కేబినెట్ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ల పనితీరును ప్రధాని మోదీ ప్రశంసించారు. యోగాడేను అత్యంత పకడ్బందీగా.. నిర్వహించిన తీరు ప్రధాని మోదీని బాగా ఆకట్టుకుంది. గత పదకొండేళ్లుగా తను యోగా దినోత్సవంలో వివిధచోట్ల పాల్గొన్నా.. అంత అనుభూతి రాలేదని కానీ విశాఖలో మాత్రం.. అద్భుతంగా అనిపించిందన్నారు. యోగా డే నిర్వహణపై ఏపీ ప్రభుత్వాన్ని తాను నివేదిక కోరానని అది రాగానే అన్ని రాష్ట్రాలకు పంపించి స్టడీ చేయమని చెబుతామన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో గిన్నిస్ రికార్డు స్థాయిలో జరిగింది. అద్భుతమైన ప్లానింగ్ తో చిన్న పొరపాట్లు కూడా లేకుండా ఈ కార్యక్రమం జరగడం ప్రధాని మోదీని అబ్బురపరిచింది. అప్పుడే వేదిక మీదనే లోకేష్ను ప్రశంసించారు. అయితే ఆ పొగడ్తలు అప్పటికే అనుకున్నారు. కానీ కార్యక్రమం నిర్వహణ .. మొత్తం మోదీ మైండ్లో స్థిరపడిపోయిదని తాజాగా కేబినెట్ భేటీలో ప్రశంసలతో స్పష్టయింది. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు అదే వేదికపై నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. అప్పుడే మోదీ కూడా అంగీకరించారు.
నారా లోకేష్.. గిన్నిస్ రికార్డు టార్గెట్ గా పెట్టుకుని ఏ మాత్రం లోపాల్లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. మూడు లక్షల మందికిపైగా ఒకే సారి .. ఒకే చో.. విశాఖ నుంచి బోగాపురం వరకు యోగా చేశారు. ఇది గిన్నిస్ సంస్థను కూడా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఈ ఘనత గురించి సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసింది.