మళ్లీ తెరపైకి “ఒకే దేశం.. ఒకే ఎన్నికలు”..! 19న భేటీ..!?

రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. గతంలో.. వెనక్కి పెట్టిన.. తమ లక్ష్యాలను… మందుకు తీసుకు వచ్చారు. ఇందులో మొదటిది.. “ఒకే దేశం – ఒకే ఎన్నికలు”. లోక్‌సభతో పాటు.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. భావిస్తున్నారు. ప్రతీ ఏడాది… నాలుగైదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల ఎన్నికలు.. ఒక్కో ఏడాదిలో జరుగుతున్నాయి. దాని వల్ల… అత్యధిక కాలం ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు వస్తుందని… దీని వల్ల అభివృద్ది కుంటుపడుతుందని భావిస్తున్నారు. అందుకే.. ఒకే దేశం “ఒకే దేశం – ఒకే ఎన్నికలు” ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పట్లో..ఎన్డీఏ పక్షాలు ఆమోదం తెలిపాయి. విపక్షాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు మళ్లీ అభిప్రాయసేకరణకు కేంద్రం సిద్ధమయింది.

కేంద్ర ప్రభుత్వం ఈ నెల పందొమ్మిదో తేదీన..ఓ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది. టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ లకు కూడా.. ఆహ్వానం అందింది. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలన్నింటికీ.. ఈ ఆహ్వానాలు వెళ్లాయి. అయిదు లక్ష్యాల సాధనకోసం అన్ని పార్టీల అధ్యక్షులతో నిర్వహించే ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా హాజరుకానున్నారు. ఐదు లక్ష్యాలు అని చెప్పినప్పటికీ.. అసలు .. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. అనే కాన్సెప్ట్‌పై అభిప్రాయసేకరణ కోసమేనని నమ్ముతున్నారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదనను.. అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించడం ఖాయంగా కనిపిస్తోంది. ఓడిపోయిన పార్టీలు.. ముందస్తుగా ఎన్నికలు రావాలని కోరుకుంటాయి. ఇప్పుడు తిరుగులేని అధికారం అనుభవిస్తున్న బీజేపీనే.. ముందస్తు ఎన్నికలకు వస్తే.. రాజీయ పార్టీలన్నీ రెడీగా ఉంటాయి. గతంలో టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు.. అంగీకరించింది. కానీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యతిరేకించింది. ఇప్పుడు మాత్రం.. ముందస్తు ఎన్నికలు వస్తే… మరో మాట లేకుండా అంగీకరించడం సాధ్యమే. ఇప్పటికే.. కేంద్రం… ” ఒకే దేశం – ఒకే ఎన్నికలు” కోసం… అనేక రకాలుగా కసరత్తు చేసింది. అమలు చేయడమే మిగిలింది. మరోఏడాదిలో.. రాజ్యసభలోనూ.. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వస్తుంది కాబట్టి… ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సులువే. అందుకే.. “ఒకే దేశం – ఒకే ఎన్నికలు” లక్ష్యంగా ముందే జరిగితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close