జమిలీపై భేటీ..! మోడీ ఔనంటే కాదనేవారు ఎవరు..?

నరేంద్రమోడీ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత.. శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడ్ని ఆహ్వానించారు. మొత్తం ఐదు అంశాలు ఎజెండాగా చెప్పినప్పటికీ.. అసలు విషయం మాత్రం జమిలీ ఎన్నికలు.

మోడీ ఆలోచనను వ్యతిరేకించే ధైర్యం ఎవరికయినా ఉందా..?

“ఒకే దేశం – ఒకే ఎన్నికలు” అనే నినాదాన్ని భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా వినిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సగానికి సగం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేసి.. 2024 నాటికి పూర్తి స్థాయిలో… జమిలీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అందు కోసం సాధ్యాసాధ్యాల పరిశీలనకు లా కమిషన్‌ను కూడా నియమించారు. ఆ కమిషన్ అన్ని పార్టీల దగ్గర్నుంచి అభిప్రాయాలు తీసుకుంది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఎదురయ్యే సవాళ్లు..అధిగమించాల్సిన మార్గాలతో నివేదిక సిద్ధం చేసింది. కానీ…అప్పటి రాజకీయ పరిస్థితుల్లో.. బీజేపీని వ్యతిరేకించే ప్రతీ పార్టీ… జమిలీ ఎన్నికలను అంగీకరించలేదు. అందుకే జమిలీ లేకుండానే ఎన్నికలు ముగిశాయి.

గతంలో వ్యతిరేకించిన పార్టీలూ ఇప్పుడు నోరు తెరవలేని పరిస్థితి..!

గతంలో జమిలీ ప్రతిపాదన వచ్చినప్పుడు లా కమిషన్ ముందు… కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ , టీడీపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే.. ఆయా పార్టీల కారణాలన్నీ రాజకీయ పరమైనవే. బీజేపీ విధానాన్ని సమర్థించే అవకాశం లేని కారణంగా.. కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు… అలాంటి పరిస్థితి లేదు. కొన్ని పార్టీలను జమిలీ ఎన్నికలను స్వాగతించక తప్పని పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మోదీతో భేటీకి మూడు ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం లభించింది. టీఆర్ఎస్, వైసీపీ సమావేశానికి వెళ్తున్నాయి. టీడీపీ నుంచి మాత్రం ఎవరూ వెళ్లడం లేదు. మమతా బెనర్జీ కూడా.. సమావేశానికి వెళ్లడం లేదు. ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లా కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు.

మోడీ తల్చుకుంటే “జమిలీ” ఖాయమే..!

ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే… కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అధికారసమయాన్ని కుదించాల్సి ఉంది. మరికొన్నింటిలో రాష్ట్రపతి పాలన విధించడమో.. లేదా అధికారాల్ని పొడిగించడమో చేయాలి. పెంచితే సరే అంటారు కానీ..కుదిస్తే మాత్రం.. కొంత మంది అంగీకరించే అవకాశం ఉండదు. కానీ మోదీ పట్టుబడితే.. అంగీకరించకతప్పని పరిస్థితి అధికారంలో ఉన్న కొన్ని పార్టీలకు ఉంది. జేడీయూ, జేడీఎస్, వైసీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీజేడి లాంటి పార్టీలు.. తప్పదు.. అని కేంద్రం అంటే.. సరేననక తప్పని పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఉందనేది చాలా మంది చెప్పే మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close