మోడీ నేతృత్వంలోని ఆ కమిటీలో జగన్‌తో పాటు చంద్రబాబు కూడా..!

ఏపీ సీఎం జగన్ మరో ఇద్దరో.. ముగ్గురో టీడీపీ ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు.. ప్రధాని మోడీ ప్రత్యేక గౌరవం ఇచ్చారు. భారత్ వచ్చే ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణను ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నారు. అందు కోసం కమిటీని నియమించారు. ఆ కమిటీలో సహజంగానే ముఖ్యమంత్రులకు చోటు లభించింది. , త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ పక్షాల నాయకులకు హోదాల ప్రకారం చాన్స్ కల్పించారు.

వారితో పాటు మరికొంత మంది ప్రముఖులకు చోటు కల్పించారు. వారిలో చంద్రబాబు, రామోజీరావు, భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా కూడా ఉన్నారు. అలాగే క్రీడా రంగం నుంచి పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు, మిథాలీరాజ్‌లకు స్థానం దక్కింది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. తక్షణం ఈ కమిటీ అమల్లోకి వచ్చినట్లేనని కేంద్రం వెల్లడించింది. ఈ కమిటీ తొలి సమావేశం ఎనిమిదో తేదీన జరగనుంది. రాజకీయ పరంగా విబేధిస్తున్న చంద్రబాబును.. మోడీ చాలా కాలంగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

కరోనా కాలంలో ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై దేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఫోన్ చేశారు కానీ చంద్రబాబును లైట్ తీసుకున్నారు. అయితే.. చంద్రబాబు తానే పీఎంవోకు ఫోన్ చేసి మాట్లాడి తన ఆలోచనలను నివేదిక రూపంలో పంపించారు. ఆ తర్వాత కూడా.. చంద్రబాబు విషయంలో మోడీ సానుకూలంగా ఉన్నట్లుగా సంకేతాలు రాలేదు. ఇప్పుడు.. స్వాతంత్ర్య దినోత్సవ కమిటీలో చోటు కల్పించారు. పధ్నాలుగేళ్లు సీఎంగా చేయడం.. సుదీర్ఘ కాలం కీలక పాత్ర పోషించిన కారణంగా చంద్రబాబుకు చాన్సిచ్చారని అంచనా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close