ఫిబ్రవరిలో తెలంగాణాకి రానున్న ప్రధాని మోడీ?

తెలంగాణా ఐటి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కె.టి.ఆర్. ప్రధాన ఆరోపణ ఏమిటంటే తెలంగాణా ఏర్పడి ఏడాదిన్నర అయినా ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణా గడ్డపై అడుగుపెట్టలేదని. అలాగే తెరాస నేతల మరో ప్రధాన ఆరోపణ ఏమిటంటే కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని. ఈ రెండు ఆరోపణలకు ఒకే సమాధానంగా వచ్చే నెల మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోడి రామగుండంలో నిర్మించబోయే ఎరువుల కర్మాగారానికి శంఖుస్థాపన చేయడానికి రాబోతున్నారని బీజేపీ నేతలు చెపుతున్నారు. దానితో బాటే రామగుండంలో ఎన్.టి.పి.సి. నిర్మించ తలబెట్టిన 4000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా శంఖుస్థాపన జరుగవచ్చని సమాచారం. తద్వారా ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణాలో పర్యటించినట్లు అవుతుంది. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి మిగిలిన అన్ని రాష్ట్రాలలాగే కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చాటి చెప్పినట్లు అవుతుంది.

జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై తెరాస చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి ఇది బీజేపీకి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ కార్యక్రమాన్ని ఈ నెలలోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరిగేలోగా పెట్టుకొని ఉంటే దాని వలన బీజేపీకి చాలా ప్రయోజనం కలిగి ఉండేది. కానీ ప్రధాని మోడి షెడ్యూల్ ఖాళీ లేకపోవడంతో వచ్చే నెల మొదటివారంలో పెట్టుకోవలసి వచ్చినట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close