ఎంపి కీర్తి ఆజాద్ ని సస్పెండ్ చేసిన బీజేపీ

ఎంపి కీర్తి ఆజాద్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై అయన తీవ్ర ఆరోపణలు చేయడంతో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేస్తున్నప్పుడు, కీర్తి ఆజాద్ కూడా ఆయనతో గొంతు కలిపి జైట్లీపై విమర్శలు గుప్పించారు. తనపై కూడా పరువు నష్టం దావా వేయమని జైట్లీకి సవాలు విసిరారు. బీజేపీ అధిష్టానం ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏమాత్రం తగ్గకుండా విమర్శలు గుప్పిస్తుండటంతో తప్పనిసరిగా సస్పెన్షన్ వేటు వేయవలసి వచ్చింది. ఆయన బిహార్ లోని దర్బంగా లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై కీర్తి ఆజాద్ స్పందిస్తూ “డీడీసీఏలో అనేక అక్రమాలు జరిగాయనే నా మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. కంప్యూటర్లు మొదలుకొని చిన్న చిన్న వస్తువుల కొనుగోలు వరకు ప్రతీదానిలో అక్రమాలు జరిగాయి. ఎటువంటి టెండర్లు పిలవకుండానే లక్షల రూపాయలు విలువ చేసే పనులను ముక్కూ మొహం తెలియని సంస్థలకు అప్పగించేశారు. ఈ అవినీతి బాగోతాలు నేనే కాదు ‘వికీ లీక్స్’ కూడా బయటపెట్టింది అని చెప్పి దానికి సంబంధించిన వీడియోని కూడా ప్రదర్శించి చూపారు. తను అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే పోరాడుతున్నాను తప్ప ఎవరో వ్యక్తులను టార్గెట్ చేసుకొని కాదని అన్నారు. తనపై సస్పెన్షన్ విధించడం చాలా దురదృష్టకరమని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close