అన్నట్లే, కారుకి అంత్యక్రియలు

దావూద్ ఇబ్రహిం వాడిన ఆలీవ్ రంగు కారుని వేలం కొన్న అఖిలభారత హిందూమహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ దానికి నిప్పుపెట్టి అంత్యక్రియలు చేశారు. ఇవ్వాళ మధ్యాహ్నం అనుకున్న సమయానికి శాస్త్రోక్తంగా కారుకు నిప్పుపెట్టారు. ఢిల్లీకి చేరువలోనే ఉన్న ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో ఒక ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసుకుని అక్కడకు దావూద్ వాడిన కారు (ఇప్పుడది డొక్కకారుగా మారింది) ఈడ్చుకొచ్చి, దానిపై కట్టెలు ఉంచి శవదహన సంస్కారం చేసినట్లుగా భావిస్తూ కారుని తగలెట్టారు. ఈ అంత్యక్రియలకు కర్తృత్వం చక్రపాణి మహరాజ్ తీసుకున్నారు.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం వాడిన అనేక వస్తువులతోపాటుగా ఈ కారుని కూడా ముంబయిలో డిసెంబర్ 9న వేలానికి ఉంచారు. ఆ వేలంలో చక్రపాణి మహరాజ్ దాన్ని 32వేల రూపాయలుపోసి కొన్నారు. దావూద్ అతని ముఠా వల్ల దేశానికి జరుగుతున్న అరిష్టాలు తొలిగిపోయాయని చెప్పడానికి నిదర్శనంగానే కారుకి అంత్యక్రియలు చేశారట. మొదట్లో ఈ కారుని మంచి కోసం ఉపయోగిద్దామనుకున్నారు. అంబులెన్స్ గా వాడాలని కూడా అనుకున్నారు. అయితే ఈలోగానే దావూద్ ముఠా మనుషులు ఫోన్లలో బెదరించడంతో , ఇందుకు నిరసనగా కారుకి అంత్యక్రియలు చేయాలని చక్రపాణి మహరాజ్ నిర్ణయించారు. పైగా వేలంలో కొన్న ఈ కారు డొక్కుగా మారింది. ఇది ఏ రకంగానూ ఉపయోగించే పరిస్థితిలో లేదు.

చక్రపాణి మహరాజ్ మొబైల్ ఫోన్ కి ఈ ఉదయం (బుధవారం) కూడా బెదరింపులొచ్చాయి. ఎన్ని బెదరింపులు వచ్చినా లెక్కచేయకుండా అనుకున్నట్లుగానే కారుని దగ్ధం చేశారు. ఈ కారు అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న హిందూ మహాసభ కార్యకర్తలు, జాతీయ పతాకాలను చేతుల్లో ధరించి, `భారతమాతకు జై..’ అంటూ నినాదాలు చేశారు.

ముంబాయిలో కారు కొన్నతర్వాత దాన్ని గుజరాత్, హర్యానా, ఢిల్లీల మీదగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు నిన్న సాయంత్రానికే చేర్చారు. ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో ఉన్న కనవాణి ప్రాంతంలో కారుకు అంత్యక్రియలు చేశారు. అయినప్పటికీ ఘజియాబాద్ పోలీసులు పట్టించుకోలేదు. ఆ ప్రాంతం నొయిడాలోని సెక్టర్ 58వ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని వారు చేతులు దులుపుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close