మంత్రి `పెద్దమ్మ’కి బిచ్చగాళ్లంటే పడదు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి , ఆయన ఆశయాల గురించి ముందుగా ఒక్క మాట చెప్పుకున్న తర్వాతనే బిచ్చగాళ్లు, రైతులంటే నచ్చని ఒక మహిళా మంత్రిగారి ముచ్చట చెప్పుకుందాం.

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ కి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు కొన్ని ఆదర్శాలున్నాయి. తన ప్రభుత్వం పేదల పక్షమని చాలాగర్వంగా చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపుడతుంటారు. అలాగే, రైతుల కష్టాలు తీర్చాలని తరచూ చెబుతుంటారు. అయితే, ముఖ్యమంత్రి చెబుతున్న మాటలకు పూర్తి విరుద్ధంగా, ఆయన క్యాబినెట్ లోని ఒక మహిళా మంత్రి ప్రవర్తిస్తున్నారు. ఆమె ఈమధ్యనే రాజకీయాల్లోకి ప్రవేశించిన వ్యక్తి కానేకాదు. రాజకీయాలతో జుట్టు నెరసిన వ్యక్తి. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఈ పెద్దమ్మ సీనియర్ మంత్రిగా ఉన్నారు.

ఆమె ఒకటికాదు, రెండుకాదు నాలుగైదు కీలకశాఖలకు మంత్రిగా ఉన్నారు. రాజకీయంగా పైకి ఎదిగినకొద్దీ ఆమెలో అసహనం పెరిగిపోతున్నట్లుంది. ఆమెకు ఇప్పుడు పేదలంటే పడటంలేదు. మరీ ముఖ్యంగా బిచ్చగాళ్లంటే అసహ్యమని తాజా సంఘటనతో తేలిపోయింది. అలాంటి వారు కనబడితే కాలితో తన్నాలనిపిస్తుందేమో…. ఇక రైతుల కష్టాలు అర్థంచేసుకోవడమన్న మాటేలేదు. రైతులపై ఏకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది. అయిన్పటికీ, మంత్రిమండలిలో ఆమె స్థానం మాత్రం చెక్కుచెదరడంలేదు. ఇదో విచిత్ర పరిస్థితి.

ఈ సీనియర్ మహిళా మంత్రిపేరు – కుసుం మెహ్దేలె. మధ్యప్రదేశ్ రాష్ట్ర అవతరణదినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే ఆదివారంనాడు మంత్రి తన సొంతఊరు పన్నాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడ బస్టాండ్ వద్ద క్లీన్ డ్రైవ్ కూడా చేపట్టారు. ఆ తర్వాత ఆమె తన కార్లోకి ఎక్కబోతుంటే, బిక్షాటన చేసుకునే ఓ బాలుడు కారుకు అడ్డంవెళ్ళి ఆమె కాళ్లమీద పడి అడుక్కోవడం ప్రారంభించాడు. అంతే ఆమెకు కోపం వచ్చి పిల్లాడ్ని తన్నేశారు. ఇంతకీ పిల్లవాడు చేసిన తప్పేమిటంటే, అమ్మగారిని ఓ రూపాయి ఇవ్వమని అడగడమేనట. ఇదంతా వీడియో కెమేరాలో చిక్కింది. అంతే ఆ వీడియో అంతర్జాలంలో వైరల్ గా స్ప్రెడ్ అయింది.

BOY

మంత్రిగారి పర్యటన నిమిత్తం అక్కడే స్పెషల్ డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ చాలా దగ్గర నుంచి ఈ విషయమంతా నిశితంగా గమనించాడు. ఆ పిల్లాడు హఠాత్తుగా ఆమె దగ్గరకు వెళ్ళి కాళ్లమీద పడి రూపాయి అడిగాడని చెప్పాడా పోలీస్. ఈ కుర్రాడు ఎవరని ఆరాతీస్తే, బస్టాండ్ లో అడుక్కునేవాడని తేలింది. బహుశా కొత్తగా బిక్షాటన చేయడం మొదలుపెట్టాడేమో, లేకుంటే మంత్రివర్యుల కారుకి అడ్డంగా వెళ్ళి, రూపాయి ఇమ్మని అంత ధైర్యంగా అడుగుతాడా? హన్నన్నా..

కుసుం మహ్దెలె న్యాయశాఖతో పాటుగా శాసనసభ వ్యవహారాలు, ఆరోగ్యం, ఇంజనీరింగ్, పశుసంవర్దక వంటి శాఖలకు ఇన్ ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ మంత్రిగా ఉన్న కుసుం ఇలా వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారికాదు, గతంలో ఆమె రైతులపై కూడా చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

`రైతులు తమ కొడుకులను కోల్పోయినప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడంలేదు. కానీ పంట పోయిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎవరైనా ఎలా నమ్మడం ?’ అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తునేఉన్నాయి.

చౌహాన్ నేతృత్వంలోని పాలన ఏ స్థాయిలో ఉన్నదో, పేదలప్రజలకు, రైతులకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందో ఈ సంఘటనలు చాటిచెబుతున్నాయంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అంతేకాదు, పేదలకు, రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వం ఒక పక్క చెబుతుంటే, సీనియర్ మంత్రి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రతినిధి కె.కె. మిశ్రా దుమ్ముదులిపారు.

పేదలు, రైతుల పట్ల ఏమాత్రం జాలి, కరుణ లేని ఇలాంటి పాలకులు ఒక్క మధ్యప్రదేశ్ లోనే కాదు, మనదేశంలో చాలాచోట్ల ఉన్నారు. వైకుంఠపాళిలో నిచ్చెనలు ఎక్కి పైకెదిగిన వాళ్లకు దిగువస్థాయి కష్టాలు తెలియడంలేదు. అందుకే కళ్లునెత్తికెక్కినట్లు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాళ్లు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి. రాజకీయాలకు అతీతంగా వారికళ్లు తెరిపించాలి.

సరే, ఇంతజరిగినా మరి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా చేతులునలుపుకుంటూ కూర్చునేఉంటారా, లేక తన ఆశయాలకు విరుద్ధంగా ఉన్న ఈ పెద్దమ్మ పని పడతారా? వేచిచూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close