సానియా, హింగిస్ జైత్రయాత్ర

హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. ఆదివారం నాడు మార్టినా హింగిస్ తో కలిసి మరో టైటిల్ ను గెల్చుకుంది. సింగపూర్లో డబ్ల్యు.టి.ఎ. టోర్నీమహిళల డబుల్స్ ఫైనల్లో సానియా, హింగిస్ చెలరేగి ఆడి అలవోకగా గెలిచారు. ఈ ఏడాదిలోనే తొమ్మితో టైటిల్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించారు.

సానియో జోడీ జోరుకు, స్పెయిన్ కు చెందిన ప్రత్యర్థులు బేజారయ్యారు. గట్టిగా కౌంటర్ ఇవ్వలేక చేతులెత్తేశారు. దీంతో వరుస సెట్లలో పోరు ముగిసింది. 6-0, 6-3 స్కోరుతో సానియా, హింగిస్ జోడీ విజయం సాధించిందంటే మ్యాచ్ ఎంత ఏకపక్షంగా సాగిందో అర్థమవుతుంది.

సానియా, హింగిస్ జోడీకి ఇది వరసగా 22వ విజయం. టైటిల్స్ పరంగా తొమ్మదో చాంపియన్ షిప్. ఇద్దరి మధ్యా చక్కటి సమన్వయం కుదరడంతో టెన్నిస్ కోర్టులో ఎదురు లేకుండా డబుల్స్ పోటీల్లో వీర విహారం చేస్తున్నారు. ఈ జోడీ పోటీకి దిగుతోందంటే ప్రత్యర్థులు ఓటమికి సిద్ధం కావాల్సిందే అనే స్థాయిలో వీరి హవా నడుస్తోంది.

జనవరిలో సిడ్నీ ఇంటర్నేషనల్ టోర్నీ చాంపియన్ షిప్ సాధించడంతో ఈ జంట జైత్రయాత్ర మొదలైంది. ఈ ఏడాది వీరు సాధించిన విజయాల్లో రెండు గ్రాండ్ స్లాం టైటిల్స్ కూడా ఉన్నాయి. వింబుల్డన్, యు ఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్స్ ను ఈ జోడీయే సాధించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close