అదే మరి చంద్రబాబు నాయుడు వ్యూహచతురత!

తనను రాజకీయాల్లో చాణక్యుడు అని అందరూ ఎందుకు అంటూ ఉంటారో.. వ్యూహరచనలో తనను ప్రత్యర్థులు కూడా ఎందుకు ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం నాడు మరోమారు నిరూపించుకున్నారు. ముద్రగడ పద్మనాభం దీక్షను విరమింపజేయడానికి సంబంధించి, డిమాండ్లను కొంత మేరకు తాను ఆమోదిస్తున్నట్లుగా కనిపించడానికి వెళ్లిన దూతలను ఎంచుకున్న వైనమే చంద్రబాబునాయుడు వ్యూహచాతుర్యాన్ని తెలియజేస్తున్నది. ముద్రగడతో దీక్ష విరమింపజేయడానికి ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులను పంపించారు. వీరిద్దరినీ ఎంచుకోవడమే పెద్ద వ్యూహం అని పలువురు భావిస్తున్నారు.
ఆ వివరాలు ఎలాగంటే….

(1) ప్రభుత్వం తరఫున దీక్ష విరమింపజేసేలా వెళ్లడానికి కిమిడి కళా వెంకటరావుకు ఉన్న అర్హత ఏమిటి? ఆయన కేవలం పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చి దీక్ష విరమింపజేయడానికి ఎలా వెళ్తాడు? ఇది సాధారణంగా అందరికీ కలిగే సందేహం. కానీ… ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడం ద్వారా చంద్రబాబునాయుడు తన తెలుగుదేశం పార్టీకి అదనపు మైలేజీ కోరుకుంటున్నారు. అందుచేతనే, పార్టీ నాయకుడే వెళ్లి దీక్ష విరమింపజేసినట్లుగా కలర్‌ రావాలని ఆయన ఆరాటపడ్డారనేది సమాచారం. కిమిడి కేవలం ఒక ఎమ్మెల్యే. రాజ్యాంగం పరంగా చూస్తే.. ఎమ్మెల్యే పాత్రలు చాలా పరిమితంగా ఉంటాయి. కాకపోతే.. ప్రభుత్వం తరఫున ఎవరూ లేరని నిందలు రాకుండా అచ్చెన్నాయుడును కూడా జత కలిపారు.

(2) అయినా చంద్రబాబు కాపులకు ఇచ్చే హామీల గురించి కాపేతర ప్రతినిధులు వచ్చి చెబితే ముద్రగడ ఎలా నమ్ముతారు? నమ్మినా దాన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తారు? కష్టం గనుకనే.. అసలు మంతనాలు, విరమణకు సంబంధించిన హామీ అంతా చంద్రబాబు ఆదివారం రాత్రే పూర్తిచేయించారు. తన తరఫున అసలు సిసలు ప్రతనిధులుగా హామీలు ఇచ్చి మంతనాలు, కాపు ప్యాకేజీ డిస్కషన్‌ పూర్తి చేయడానికి తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర రామారావులను ముద్రగడ వద్దకు ఆదివారం పంపి, విరమణకు రంగం సిద్ధం చేసేశారు. అంటే సోమవారం ఉదయం వెళ్లిన వాళ్లు.. కేవలం ముందే షూట్‌చేసేసిన పార్ట్‌కు సంబంధించి.. ఆ పిమ్మట రిహార్సల్స్‌ చేసిన డమ్మీ నటులన్నమాట.

(3) ముద్రగడ దీక్ష విరమింపజేయడానికి తొలుత కిమిడి కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు వెళతారనే ప్రచారం జరిగింది. బ్రేకింగ్‌న్యూసులు వచ్చాయి. అయితే ఆ తర్వాత గంటా పేరు మారిపోయి, దాని స్థానంలో అచ్చెన్నాయుడు పేరు జత చేరింది. కాపుల దీక్షలను విరమించడానికి కేవలం కాపులను మాత్రమే పంపడంలో స్కెచ్‌ సవ్యంగా ఉండదని చంద్రబాబు ఫీలయ్యారని అనుకోవాలి.

(4) చిట్టచివరగా ముద్రగడ వద్దకు కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు వెళ్లారు. కళా వెంకటరావు తూర్పు కాపు కులానికి చెందిన నాయకుడు. అచ్చెన్నాయుడు కొప్పుల వెలమ.. బీసీ కులం. కాపుల రిజర్వేషన్‌ వ్యవహారంలో కాపులు పాజిటివ్‌గా ఎంత స్పందిస్తున్నారో, నెగటివ్‌గా బీసీలు కూడా అంతే స్పందించే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబునాయుడు ఎంచుకుని మరీ.. ఒక కాపు, ఒక బీసీ నాయకులను పంపినట్లుగా భావించాలి. పైగా అక్కడకు వెళ్లి మీడియా ముందు మాట్లాడినంత సేపూ అచ్చెన్నాయుడు తాను బీసీ కులానికి చెందిన వాడిని అనే సంగతిని పదేపదే హైలైట్‌ చేసుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పదేపదే తాను కూడా ఒక బీసీ మంత్రిగా చాటి చెపుతున్నా అంటూ చాటడానికి ప్రయత్నించారు. ఒకవైపు కళా వెంకటరావుతో కాపులను బీసీల్లో చేర్చడానికి రెడీ అనే విషయాన్ని ప్రకటింపజేస్తూ, మరో వైపు అచ్చెన్నాయుడుతో బీసీలకు అభ్యంతరం లేదనే విషయాన్ని ప్రచారంలోకి తేవడం అనేదే చంద్రబాబునాయుడు వ్యూహచాతుర్యం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close