ఆ విషయంలో ముద్రగడకి స్పష్టత ఉందో లేదో…

కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తుల గురించి ప్రశ్నించినపుడే ఆయన పట్ల సదభిప్రాయం లేదని అర్ధమయింది. కానీ అది కూడా తన నిశ్చితాభిప్రాయం కాదన్నట్లుంటాయి ఆయన మాటలు. ఆయన ఉద్యమం ప్రారంభించినపుడు ముగించేటపుడు ఒకలాగ, ఆమరణ నిరాహార దీక్షముగించేటపుడు మరొకలాగ, మళ్ళీ ఆ తరువాత వివిధ సందర్భాలలో వివిద రకాలుగా చంద్రబాబు నాయుడు గురించి అభిప్రాయలు వ్యక్తం చేస్తుంటారు. అదేవిధంగా తను మొదలుపెట్టిన ఉద్యమం గురించి, దాని ఆశయాలు, ఫలితాల గురించి కూడా ఆయన రకరకాలుగా మాట్లాడుతుంటారు. అలాగే తన ఉద్యమానికి వెనుక నుంచి మద్దతు ఇస్తున్నవారి గురించి రాజకీయ కారణాల చేత గోప్యత పాటించవలసి వస్తోంది. ఇవన్నీ ఆయన పోరాటంలో నిబద్దతపై అనుమానాలు రేకెత్తించేవిగానే ఉన్నాయి. ఉదాహరణకి ఆదివారం విజయవాడలో జరిగిన కాపు సమ్మేళనంలో ఆయన మాట్లాడిన మాటలు గమనించినట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది.

కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి చంద్రబాబు నాయుడు ఆశలు రేకెత్తించారని, కానీ ఆయన ఆ హామీని నిలబెట్టుకోకపోవడంతో తను పోరాటం మొదలుపెట్టవలసి వచ్చిందని అన్నారు. తన ఉద్యమాన్ని బలహీనపరిచేందుకే చంద్రబాబు నాయుడు కాపులలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన పోరాటం ఆగదని అన్నారు. అంటే ముఖ్యమంత్రి తనతో వ్యవహరించిన తీరుపట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారని అర్ధమవుతోంది. కానీ మళ్ళీ అంతలోనే కాపు కార్పోరేషన్ ద్వారా రుణాలు మంజూరు విషయంలో కాపులు సంతృప్తిగానే ఉన్నారని అన్నారు. త్వరలోనే ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కూడా అమలుచేస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. అంటే ఈ రెండు విషయాలలో అయన చంద్రబాబు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసారనుకోవచ్చును.

ఆయన కాపులకు రుణాలు, రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని అందరికీ తెలుసు. కానీ ఆయన నిన్న ఏమన్నారంటే కాపులలో ‘నిరుపేదలకు’ రుణాలు, రిజర్వేషన్లు మజూరు చేసి వారిని కూడా సమాజంలో మిగిలిన వారితో సమాన స్థాయికి ఎదిగేందుకు వీలు కల్పించడమే తన ఆశయమని చెప్పుకొన్నారు. అంటే తన పోరాటం కాపులు అందరి కోసం కాదని, కాపులలో నిరుపేదల కోసమేనని భావించవలసి ఉంటుంది. అంటే ఆయన ఆశయంలో కూడా స్పష్టత లేదని అర్ధమవుతోంది. ఆయన యావత్ కాపు కులస్థుల కోసం పోరాడుతున్నారని భావించబట్టే, కాపుకులస్తులు అందరూ ఆయన ప్రారంభించిన పోరాటానికి మద్దతు పలుకుతూ కదిలివచ్చేరు. కానీ తన పోరాటం వారిలో కొందరి కోసమేనని ఆయన చెపుతున్నారు కనుక దీనిపై కాపు సామాజిక వర్గం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

ఈవిధంగా వివిధ అంశాలపై ఆయన ప్రతీసారి చాలా భిన్నంగా మాట్లాడుతుండటం వలన ఆయన నిబద్దతను అందరూ అనుమానించే పరిస్థితులు ఆయనే కల్పించుకొంటున్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటంలో ఆయన తన భార్యను కూడా కలుపుకొనిపోవాలని ప్రయత్నించే బదులు, కాపు కులస్తులని, నేతలందరినీ కలుపుకుపోతూ సమిష్టి నిర్ణయాలు తీసుకొంటే ఇటువంటి విమర్శలు, సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చును కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close