ముద్రగడకు రాయబారాలు

కాపునాయకుడు ముద్రగడ పద్మనాభంను టిడిపి సీనియర్‌నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలుసుకుని చర్చలు జరపడం రాజకీయ వర్గాలను ఆకర్షించే పరిణామం. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల తర్వాత తన ఆందోళనను మూడు మాసాలు వాయిదా వేస్తున్నట్టు ముద్రగడ ప్రకటించారు. దానికి ఏవో సాంకేతిక కారణాలు చెప్పారు గాని వాస్తవానికి ఉద్యమం ఒక ప్రతిష్టంభనలో పడిపోయిందన్న అభిప్రాయం కూడా దాని వెనక వుంది. మళ్లీ ఒకసారి సమీక్ష చేసుకుని కొనసాగించడమా లేక విరామం ఇవ్వడమా అని ఆయన ఆలోచించుకుంటుండవచ్చు. ఈ లోగా తెలుగుదేశం మాత్రం కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలలో వైసీపీకి ఉపయోగపడేందుకే ముద్రగడ విరామం ఇచ్చారని ఆరోపించింది. కాపులను(మాలలను కూడా)ు మంచి చేసుకోవడానికి తమ అధినేత మరీ ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారనే అసంతృప్తి కొంతమంది టిడిపి నేతలలో వుంది. అయితే చంద్రబాబు అలాటివాటిని పట్టించుకోదలచలేదు. గతసారి తాము అధికారంలోకి రావడానికి అదనంగా కలసి వచ్చిన అంశం కాపులే గనక వారిని ఎలాగైనా వైసీపీ వైపు వెళ్లకుండా ఆపాలనే ఆలోచన ఆయనది.పవన్‌ కళ్యాణ్‌ జనసేన ప్రభావం కాపులపై ఎక్కువగా వుంటుందనే అంచనాలు వచ్చినా ఆయన ఆ తరహా సమీకరణల గురించి మాట్లాడక పోవడం, తన రాజకీయ కదలికలే ఇంకా అస్పష్టంగా వుండటం కారణంగా ఆ అంశం వెనక్కు పోయింది. నంద్యాల కాకినాడ పలితాలు ముద్రగడపైనా ఎంతో కొంత ప్రభావం చూపిస్తున్నట్టు కొందరు పరిశీలకులంటున్నారు. ఈ పరిస్తితులలో సీనియర్‌ నాయకుడైన బుచ్చయ్య చౌదరి కలుసుకోవడం యథాలాపంగా జరిగివుంటుందని అనుకోలేము. ఏవో ప్రతిపాదనలతో వెళ్లి వుంటారనుకోవాలి. సమయం కావలసినంత వుంది గనక ఇరు పక్షాలూ ఆలోచించుకోవడానికి అవకాశముంటుంది. గతంలోనూ ఈ ఆందోళన ప్రారంభించిన తర్వాత కూడా ముద్ర గడ తీరుతెన్నులు గమనిస్తున్న వారు ఆయన గురించి ఇదమిద్దంగా చెప్పడానికి వెనుకాడుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా సంభవమే నని ముక్తాయిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close