బాపట్ల ఎంపీ..మందడంలో భూమాయ..!?

కోర్టులపై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని తరలింపునకు బహిరంగంగా మద్దతు పలుకుతున్న నందిగం సురేష్.. సచివాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని తన ఆనుచరులతో ఆక్రమించుకున్నారంటూ.. టీడీపీ నేత వర్ల రామయ్య కొన్ని పత్రాలు విడుదల చేసి..సీఆర్డీఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తుళ్లూరు మం. మందడంలో సచివాలయానికి కిలోమీటర్‌ దూరంలో ఉన్న భూమిని ఎంపీ అనుచరులు ఆక్రమించుకున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.

సీఆర్డీఏకు చెందిన భూమిని కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని.. విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ అంశంపై ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, శ్రావణ్ కుమార్‌లతో నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. మందడంలో ఎంపీ అనుచరులు ఆక్రమించిన భూముల్ని టీడీపీ నేతలు పరిశీలిస్తారు. రాజధాని ప్రాంతానికి చెందిన నందిగం సురేష్.. వైసీపీలో అనూహ్యంగా ఎదిగారు.

బాపట్ల టిక్కెట్ పొంది గెలిచి ఎంపీ అయ్యారు. అయితే.. ఆయన అనుచరుుల మొదటి నుంచి ఇసుక తరలింపు వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే ఉండవల్లిశ్రీదేవితో వివాదాలు సీఎం జగన్ వద్దకు కూడా వెళ్లాయి. ఇప్పుడు కొత్తగా భూకబ్జా ఆరోపణలు కూడా వస్తున్నాయి. వైసీపీ తరపున వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి సురేష్‌నే ఆ పార్టీ నాయకత్వం ముందు పెడుతోంది. మరి ఈ వివాదాలపై ఎలా స్పందిస్తుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close