అనవసరమైన ట్వీట్లతో గందరగోళం సృష్టిస్తున్న నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కానీ, సినీ రంగంలో ప్రత్యర్థులు కానీ చిరంజీవి పైన లేదంటే పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న ప్రతిసారి వారి తరఫున వకాల్తా పుచ్చుకుుని నాగబాబు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రతి విమర్శలకు మెగా అభిమానులు జనసైనికుల నుండి మంచి స్పందన వస్తుంది. ఆయన పోస్టులను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారు చాలా మంది ఉన్నారు. అయితే నాగబాబు అప్పుడప్పుడు మతం గురించి దేవుడు గురించి చేసే ట్వీట్లు మాత్రం జనాల నే కాకుండా జనసైనికులు మెగా అభిమానులను కూడా గందరగోళ పరుస్తున్నాయి. ఉదాహరణకు ఇవాళ దేవుడు అన్న కాన్సెప్ట్ గురించి నాగబాబు ఈ విధంగా ట్వీట్ చేశారు.

నాగబాబు ట్వీట్ చేస్తూ, ” ఒకప్పుడు superstar రజనీకాంత్ గారు చెప్పారు,,అది ఏంటంటే మన కంటికి కనబడే ఏదయినా ఎవరో ఒకరు create చేసిందే అయివుంటది. లేకపోతే ఆ వస్తువు కి ఉనికి ఉండదు.అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికి లో ఉందంటే ఎవరోఒక క్రియేటర్ వుండే ఉండాలి.అతడే భగవంతుడు అని చాలా గంభీరంగా చెప్పారు. మరి అంత create చేసిన దేవుడి ని create చేసింది ఎవరు.ఒక శక్తి ఉనికి లో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీసన్ వేరే ఉండాలి.ఆ రీసన్ దేవుడిని create చేసి ఉండాలి.అలాగే ఆ దేవుడిని create చేసిన రీసన్ కి ఇంకో రీసన్ ఉండాలి.సో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతు పొంతూ ఉండదు. సో గాడ్ అనే కాన్సెప్ట్ కి మీనింగ్ ఏది లేదు.సో లెట్స్ లివ్ our lives వితౌట్ the ఇన్వొల్వెమెంట్ of గాడ్ కాన్సెప్ట్..nietzsche చెప్పినట్లు” god is dead” long back. So no worries. No guilt. BUT LIVE ACCORDING TO LAW. ” అని రాసుకొచ్చారు.

అయితే అసలు నాగబాబు ఏం చెప్పదలచుకున్నాడో అర్థం కాక జనసైనికులు తికమక పడుతున్నారు. ఒకవైపు ఏమో బిజెపి భావజాలానికి అనుగుణంగా హిందుత్వానికి అనుగుణంగా ట్వీట్లు వేయడం, ఇంకొక వైపు ఏమో తాను నాస్తికుణ్ణి అన్న అభిప్రాయం వచ్చేలా ట్వీట్లు వేయడం చేస్తుండటం వల్ల, ఈ రెండింటికి పొసగక ఆయన అకౌంట్ ఫాలో అయ్యే వారు తికమక పడుతున్నారు. పైగా మతం, దేవుడు అన్నవి అత్యంత సున్నితమైన అంశాలు. వీటిమీద ఎడాపెడా అభిప్రాయాలు వెలువరచడం వల్ల భవిష్యత్తులో ఎప్పటికైనా నష్టమే తప్ప ఒరిగేది ఏమీ ఉండదు అని మెగా అభిమానులు వాపోతున్నారు. అదీ గాక తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాలలో నాస్తికులు చాలా తక్కువ. ఇక్కడి ప్రజలకు దేవుడి పట్ల మతం పట్ల విశ్వాసం పాళ్లు ఎక్కువ. ప్రజాజీవితంలో ఉంటున్నప్పుడు, రాజకీయాల్లో అడుగులు వేస్తున్నప్పుడు ప్రజల మనోభావాలను ఇబ్బంది పెట్టే ట్వీట్ ల జోలికి వెళ్లకపోవడమే నాగబాబుకు ఉత్తమమైన పని అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కుండ బద్దలు కొట్టినట్లు అభిప్రాయాలు చెప్పడం మంచిదే కానీ, అవసరం లేని ప్రతిచోటా అనవసరమైన కుండలు అన్నింటినీ బద్దలు కొట్టడం కూడా సమంజసమైన పనికాదు. మరి అభిమానుల నుండి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో నాగబాబు పంథా మార్చుకుంటాడా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close