స‌మంత‌ని మ‌ళ్లీ ప‌ట్టేశాడా?

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. ఏమాయ చేశావేతో ఇద్ద‌రూ తొలి హిట్ అందుకొన్నారు. ఆ త‌ర‌వాత ఆటోన‌గ‌ర్ సూర్య నిరాశ ప‌రిచినా.. అందులోనూ వాళ్లిద్ద‌రి కెమిస్ట్రీ అదిరిపోయింది. మ‌నంలో మ‌ళ్లీ జోడీగా క‌నిపించి మ‌రో హిట్ అందుకొన్నారు. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌ర్నీ వెండి తెర‌పై ఒకేసారి చూసే అవ‌కాశం ద‌క్క‌బోతోంది. నాగ‌చైత‌న్య – క‌ల్యాణ్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఇందులో క‌థానాయిక‌గా స‌మంత‌ని ఎంచుకొనేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

అయితే వ‌రుస సినిమాల‌తో స‌మంత బిజీ బిజీగా ఉంది. ఈ నేప‌థ్యంలో కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌గ‌ల‌దా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అన్న‌పూర్ణ కాంపౌండ్ నుంచి వ‌చ్చిన ఆఫ‌ర్ అంటే.. స‌మంత అస్స‌లు వ‌దులుకోదు. అందుకే… ఈ సినిమాకి ఓకే చెప్పే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయిన త‌ర‌వాత క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసే సినిమా కాబ‌ట్టి దీనిపై భారీ అంచ‌నాలున్నాయి. చైతూకి ఓ క‌మర్షియ‌ల్ హిట్ అందించే క‌థ‌ని క‌ల్యాణ్ కృష్ణ సిద్ధం చేశాడ‌ట‌. ఈ సినిమా అయ్యాక‌.. నాగ్‌తోనే సోగ్గాడే చిన్నినాయిన కి సీక్వెల్‌గా బంగార్రాజు చేయ‌నున్నాడు క‌ల్యాణ్ కృష్ణ‌. సో.. వ‌రుస‌గా మూడు సినిమాల పాటు అన్న‌పూర్ణ స్టూడియోస్‌తోనే ప్ర‌యాణిస్తాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close