ఇంత జరిగినా జనసేన నేతలు చంద్రబాబే కారణం అంటున్నారు..!

జగన్మోహన్ రెడ్డి చట్టాలను.. రాజ్యాంగాలను పట్టించుకోకుండా.. అమరావతిని మార్చేసి.. మూడు రాజధానులు చేస్తున్నారని.. అంతా గగ్గోలు పెడుతూంటే… జనసేన నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాత్రం… చంద్రబాబు తప్పిదాల వల్లే.. జగన్ రాజధాని మారుస్తున్నారని కొత్త కోణం ఆవిష్కరిస్తున్నారు. అమరావతి రైతులకు ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నం కావడానికి చంద్రబాబే కారణమని చెప్పుకొస్తున్నారు. రాజధాని అంశంలో భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే.. రైతులకు ఎవరు భరోసాగా ఉంటారని 2015లోనే పవన్ బలంగా మాట్లాడారని నాగబాబు గుర్తు చేసి చెబుతున్నారు.

ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములిచ్చారు.. ఇప్పుడు రాజధాని తీసుకెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుందన్నారు. ఈ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్‌కు పాల్పడుతున్న జగన్‌పై మాత్రం నాగబాబు విమర్శలు చేయడం లేదు. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబేనని మళ్లీ ప్రతిపక్ష నేత వద్దకు వెల్తున్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే నేడు తనకు అనుకూలంగా మార్చుకుని.. జగన్ రాజధానిని తరలిస్తున్నారని సూత్రీకరించారు. అంటే తరలిస్తున్న జగన్‌ది తప్పే మీ కాదు కానీ.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుది మాత్రం తప్పేనన్నమాట. నాదెండ్ల మనోహర్ కూడా… అలాంటి విమర్శలే చేస్తున్నారు.

రాజధాని తరలించేందుకు ఆస్కారం లేని చట్టం చేయడంలో.. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పుకొచ్చారు. స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల అలాంటి చట్టం ఎలా ఉంటుందో.. కూడా చెప్పాల్సి ఉంది. మొత్తానికి జనసేన నేతలు.. జగన్ ను విమర్శించడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ చంద్రబాబునే నిందించి రాజకీయం చేద్దామనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close