టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తనకు తెలియదని.. పేపర్లలో చూసి మాత్రమే తెలుసుకున్నానని నందమూరి బాలకృష్ణ మీడియాతో అన్నారు. అంతటితో వదిలేస్తే పోయేది.. కానీ.. వారందరూ తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా అనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ మాటలు.. చిచ్చు పెట్టేసినంత పని చేస్తున్నాయి. మా అధ్యక్షుడు నరేష్‌కు కూడా.. తనను పిలవడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ.. బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించడానికి ఆసక్తి కనబర్చలేదు.

ఈ వ్యాఖ్యలపై తలసాని స్పందించారు. షూటింగ్‌లు మళ్లీ ప్రారంభించే అంశంపై యాక్టివ్‌గా సంప్రదిస్తున్న వారితోనే మాట్లాడానని వివరణ ఇచ్చారు. కావాలంటే అందరితో మాట్లాడతానన్నారు. నిర్మాతల మండలి బాలకృష్ణకు కూడా చెప్పాల్సి ఉందని అభిప్రాయపడింది. ఆ వ్యవహారం అలా ఉండగానే.. నాగబాబు ఆవేశపడిపోయారు. బాలకృష్ణపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. వీడియో విడుదల చేశారు. బాలకృష్ణ టాలీవుడ్‌కు… తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని.. తాను వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేస్తున్నానని కూడా.. చెప్పుకొచ్చారు. బాలకృష్ణ భూములు పంచుకోవడానికి కలిశారా అని చేసిన మాటలు వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

ఇటీవలి కాలంలో నాగబాబు వివాదాస్పద కామెంట్లు చేస్తూ.. వార్తల్లోకి ఎక్కే ప్యరయత్నం చేస్తున్నారు. సంబంధం లేకపోయినా గాడ్సేను పొడగడమే కాదు.. గాంధీని కించ పరిచే ప్రయత్నాలు చేశారు. తీవ్రమైన విమర్శలు వస్తే.. అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. తద్వారా వివాదాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తన టెంపర్‌ను చూపించడం ఈ తరహా పబ్లిసిటీ కోసమేనంటున్నారు. స్పందించాల్సిన వాళ్లు స్పందిస్తారు కానీ.. నాగబాబుకేం సంబంధం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close