మ‌న్మ‌థుడు హిట్ట‌యితే… రాహుల్ తో మ‌రో సినిమా

‘చిల‌సౌ’తో ద‌ర్శ‌కుడిగా మారాడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. ఆ సినిమా హిట్ట‌యిన వెంట‌నే.. నాగ్‌తో సినిమా చేసే ఛాన్స్ వ‌చ్చింది. ‘మ‌న్మ‌థుడు 2’ రూపంలో. అయితే ఈ సినిమా హిట్ట‌యితే.. వెంట‌నే నాగ్‌తో మ‌రో ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేయ‌బోతున్నాడు రాహుల్‌. నిజానికి నాగ్ పిలిచిన‌ప్పుడు రాహుల్ ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా చేద్దామ‌నుకున్నాడ‌ట రాహుల్‌. ఆ క‌థ‌ని నాగ్‌కి కూడా వినిపించాడు. కాక‌పోతే.. నాగ్ ఓ ఫ్రెంచ్ సినిమా చూడ‌డం, ఆ క‌థ బాగా న‌చ్చ‌డంతో రీమేక్ చేసే అవ‌కాశం రాహుల్ ర‌వీంద్ర‌న్ చేతిలో పెట్టాడు. ఒక‌వేళ `మ‌న్మ‌థుడు 2` హిట్ట‌యితే… రాహుల్ రాసుకున్న యాక్ష‌న్ సినిమాని తెర‌పైకి తీసుకొస్తాన‌ని నాగ్ కూడా మాట ఇచ్చాడ‌ట‌. అందుకే… రాహుల్ నాగ్‌తో మ‌రో సినిమా చేయ‌డానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. మ‌న్మ‌థుడు 2 హిట్ట‌యితే రాహుల్ పై కర్చీఫ్ వేయాల‌ని కొంత‌మంది యువ హీరోలు రెడీ గా ఉన్నారు. కాక‌పోతే… ఆ ఛాన్స్ నాగ్ మ‌రొక‌రికి ఇచ్చేలా క‌నిపించ‌డం లేదు. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఒక్క‌సారి అడుగుపెడితే… వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం రివాజుగా మారుతోంది. ఇప్పుడు ఆ ఛాన్స్ రాహుల్‌కి వ‌చ్చిందేమో. బంగార్రాజుకి బ్రేకులు ప‌డ‌డంతో.. నాగార్జున రాహుల్‌కి వెను వెంట‌నే మ‌రో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close