‘గాడ్ ఫాద‌ర్’ రిజ‌ల్ట్ కోసం.. నాగ్ వెయిటింగ్‌!

చిరంజీవి – నాగార్జున సినిమాలు రెండూ ఒకే రోజు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి. అక్టోబ‌రు 5న గాడ్ ఫాద‌ర్ రిలీజ్ అవుతోంది. అదే రోజున నాగ్ ఘోస్ట్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఘోస్ట్ రిజ‌ల్ట్ నాగార్జున‌కు అత్యంత కీల‌కం. ఎందుకంటే ఈమ‌ధ్య నాగ్ సినిమాల‌న్నీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొడుతూనే ఉన్నాయి. వాటికి స‌రైన ఓపెనింగ్స్ కూడా రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో `ది ఘోస్ట్` రిజ‌ల్ట్ నాగ్ కెరీర్ తీరు తెన్నుల్ని నిర్దేశిస్తుంద‌న‌డంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే… అదే స‌మ‌యంలో నాగార్జున `గాడ్ ఫాద‌ర్` రిజ‌ల్ట్ పైనా దృష్టి పెట్టాడు. చిరు సినిమా ఫ‌లితం ఎలా ఉంటుందా? అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమాకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. గ‌త కొన్ని రోజులుగా మోహ‌న్ రాజా నాగ్ కోసం క‌థ ప‌ట్టుకొని తిరుగుతున్నాడు. నాగ్ ఈ క‌థ‌ని ఓకే చేయాలా? లేదా అనే సందిగ్థంలో ఉన్నాడు. గాడ్ ఫాద‌ర్ గ‌నుక సూప‌ర్ హిట్ అయిపోతే.. నాగ్ `నో` చెప్ప‌డానికి కార‌ణాలేం క‌నిపించ‌వు. పైగా నాగ్ తో తీసే సినిమాకి మ‌రింత బ‌జ్ వ‌స్తుంది. అందుకే `గాడ్ ఫాద‌ర్` రిజ‌ల్ట్ ఏమ‌వుతుందా? అనే ఎదురు చూపుల్లో ప‌డిపోయాడు. నాగ్ వందో సినిమా మైలు రాయికి అత్యంత స‌మీపంలో ఉన్నాడు. గాడ్ ఫాద‌ర్ హిట్ట‌యితే, వందో సినిమా బాధ్య‌త‌ని మోహ‌న్ రాజాపై పెట్టాల‌న్న‌ది నాగ్ ఆలోచ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close