ప్ర‌భాస్‌.. క‌థ మొత్తం మారిపోయె!

అన్నీ కుదిరితే ఈపాటికి ప్ర‌భాస్ – మారుతిల సినిమా ప‌ట్టాలెక్కేసేది. కానీ ఇంత వ‌ర‌కూ క్లాప్ కూడా కొట్ట‌లేదు. దానికి చాలా కార‌ణాలున్నాయి. ప్ర‌భాస్ చేతిలో స‌లార్‌, ప్రాజెక్ట్ కె లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కృష్ణంరాజు చ‌నిపోయారు. ప్ర‌భాస్ కి చిన్న పాటి స‌ర్జ‌రీ కూడా అయ్యింది. అన్నింటికంటే ముఖ్యంగా మారుతి రాసుకొన్న క‌థ‌లో భారీ మార్పులు – చేర్పులూ వ‌చ్చి ప‌డ్డాయి. ప్ర‌భాస్ తో మారుతి సినిమా అన‌గానే ప్ర‌భాస్ అభిమానులు భ‌య‌ప‌డ్డారు. మారుతిది అంతా మీడియం రేంజు హీరోల స్కూలు. ప్ర‌భాస్ ఇమేజ్‌ని హ్యాండిల్ చేయ‌లేడ‌ని బెంగ పెట్టుకొన్నారు. మారుతి కూడా త‌నదైన ఓల్డ్ స్కూల్ లో ఓ హార‌ర్ కామెడీ క‌థ రాసుకొన్నాడు. హార‌ర్ సినిమాల‌కు కాలం చెల్లిన ఈ రోజుల్లో ప్ర‌భాస్ అలాంటి జోన‌ర్‌ని ఎందుకు ఎంచుకొన్నాడో ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌లేదు.

అయితే ఇప్పుడు ప్ర‌భాస్ – మారుతిల క‌థ మొత్తం మారిపోయింది. ఇది హార‌ర్ సినిమా కాదు. ఓ క్రైమ్ కామెడీ. వ‌జ్రాల దోపిడీ నేప‌థ్యంలో సాగుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమా ఆల‌స్యం అవ్వ‌డానికి కార‌ణం. క‌థ‌లో భారీ మార్పులు చోటు చేసుకోవ‌డ‌మే. హార‌ర్ కామెడీ కాస్త‌, క్రైమ్ కామెడీగా మారిపోయింది. న‌వంబ‌రు నుంచి ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంది. వారం, ప‌ది రోజుల్లో ప్ర‌భాస్ తో మారుతికి ఓ మీటింగ్ ఉంది. ఆ త‌ర‌వాత‌… షూటింగ్ ఎప్పుడ‌న్న‌ది తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close