అందుకు సిగ్గుపడుతున్నాను: నమస్తే తెలంగాణా సంపాదకుడు

నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంపై విద్యార్ధులు, తల్లితండ్రులు, ప్రజలు  అందరూ కూడా తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో దోషులను విడిచిపెట్టమని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన ముగ్గురు విద్యార్ధులను అరెస్ట్ చేసారు. కానీ వారు ముగ్గురు అధికారిక పార్టీకి చెందిన సామాజిక వర్గానికి చెందినవారే కనుక ప్రభుత్వంలో కొందరు పెద్దలు వారిని రక్షించేప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రిషితేశ్వరి ఆత్మహత్యపై సమగ్ర న్యాయవిచారణ జరిపించి బాధ్యులయిన విద్యార్దులని, విశ్వవిద్యాలయ అధికారులని కూడా కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

రిషితేశ్వరి ఆత్మహత్యపై ఉభయ రాష్ట్రాలలో మీడియా అనేక వార్తలు, కధనాలు ప్రచురించాయి. రిషితేశ్వరి ఆత్మహత్య గురించి వడ్లమూడి హర్ష అనే వ్యక్తి వ్రాసిన ఒక కధనాన్ని నమస్తే తెలంగాణా పత్రిక సంపాదకులు కట్ట శేఖర్ రెడ్డి తన ‘కట్టా మీటా’ బ్లాగులో పెట్టారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ముగ్గురూ అధికారిక పార్టీకి చెందిన సామాజిక వర్గానికి చెందినవారేనని అందులో రచయిత పేర్కొన్నారు. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా అటువంటి కధనాలు పోస్ట్ చేసారని చాల మంది తీవ్ర విమర్శలు చేయడంతో, కట్టా శేఖర్ రెడ్డి గుంటూరులోని తన జర్నలిస్టు మిత్రుల ద్వారా పోలీసులు అరెస్ట్ చేసిన విద్యార్దుల వివరాలు సేకరించారు. అందులో చాలా ఆశ్చర్యకరమయిన విషయాలు తెలిసాయి.

అరెస్టయిన వారిలో ఏ ఒక్కరూ కూడా అధికారిక పార్టీ సామాజిక వర్గానికి చెందినవారు లేరు. వారు వైశ్య, ఎస్టీ, కాపు సామాజిక వర్గాలకి చెందినవారు. వారిలో ఒకరు తెలంగాణాలో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్ధి అని తెలిసింది. మిగిలిన ఇద్దరిలో ఒకరు గుంటూరు, మరొకరు తూర్పు గోదావరి జిల్లా  చిల్లంగి పేటకి చెందిన విద్యార్ధులుగా పోలీస్ రికార్డులలో వారి వివరాలు నమోదయి ఉన్నాయి.

ఈ వాస్తవాలను తెలుసుకోకుండా వడ్లమూడి హర్ష వ్రాసిన కధనాన్ని తన బ్లాగులో పెట్టినందుకు కట్ట శేఖర్ రెడ్డి చాలా బాధపడ్డారు. ఒక పత్రికా సంపాదకుడనయిన తాను కూడా ఒక అసత్యాన్ని అనాలోచితంగా ప్రచారం చేసినందుకు సిగ్గు పడుతున్నానని, తక్షణమే ఆ కధనాన్ని తన బ్లాగులో నుండి తొలగిస్తున్నట్లు తెలియజేసారు. రిషితేశ్వరి ఆత్మహత్యకి కారకులయిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. జరిగిన పొరపాటును సమర్ధించుకోకుండా నిజాయితీగా తన తప్పును అంగీకరించి, చేసిన తప్పును సరిదిద్దుకొన్న కట్టా శేఖర్ రెడ్డిని అభినందించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close