చైతన్యరథంపై అంతిమయాత్రతో వీడ్కోలు..! గొప్ప నివాళి..!!

నందమూరి హరికృష్ణ జీవితంలో విడదీయరాని భాగం చైతన్యరథం. ఇప్పటికీ అందరూ ఆయనను చైతన్యరథ సారధిగానే ఎక్కువగా సంబోధిస్తూంటారు. ఆ చైతన్యరథంతోనే ఆయనకు వీడ్కోలు పలకాలని.. కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఉపయోగించిన ఆ చైతన్యరథం..నిన్నామొన్నటి వరకు.. నాచారంలోని రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో శిథిల స్థితిలో ఉంది. అయితే… ఎన్టీఆర్ బయోపిక్ మూవీ కోసం.. దాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఆ చైతన్యరథంపై కొన్ని సన్నిశాలు కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం అది వాడకానికి అనువుగా ఉండటంతో దానిపైనే.. హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.

తెలుగుదేశం పార్టీ అభిమానులకు మాత్రమే కాదు.. తెలుగు ప్రజలందరికీ.. హరికృష్ణ అంటే.. ముందుగా గుర్తొచ్చేది చైతన్యరథమే. కొత్త తరానికి కాకపోయినా.. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచం మొత్తానికి చాటిన ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంలో పరిణామలను చూసిన.. తెలుసుకున్న వారందరికీ… హరికృష్ణ అంటే.. చైతన్యరథ సారధిగానే అందరికీ తెలుసు. తండ్రిని ఆంధ్రప్రదేశ్ నలుమూలలా తిప్పి.. తెలుగుదేశం జనప్రభంజనంలో భాగమయ్యాడు. రథసారధిగా పేరు తెచ్చుకున్నాడు. అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇప్పుడు ఆ రథంపైనే ఆయనను.. స్వర్గానికి సాగనంపాలని.. కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దాని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. శోకతప్త హృదయంతో.. ఆయనకు చైతన్యరథంతోనే నివాళి అర్పించాలని నిర్ణయించారు. ఏ చైతన్యరథం అయితే.. తనను చరిత్ర పుటల్లో నలిపిందో.. అదే చైతన్యరథంపై.. హరికృష్ణ అంతిమయాత్ర సాగడం… అభిమానుల్ని కలచి వేసే అంశమే. అయినా అదే గొప్ప నివాళిగా కూడా భావిస్తున్నారు.

హరికృష్ణ అంత్యక్రియలు మొదట… ఫామ్‌హౌస్‌లో నిర్వహిద్దామని కుటుంబసభ్యులు భావించినప్పటికీ.. తర్వాత వివిధ కారణాలతో… జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించాలని నిర్ణయించారు. మాసాబ్ ట్యాంక్‌లోని ఎన్టీఆర్ ఇంటి నుంచి అంతిమయాత్ర సాగనుంది. అధికార లాంఛనలాతో వీడ్కోలు పలకాలని..తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అభిమానుల సందర్శనార్థం ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌లోనూ కాసేపు పార్ధీవదేహాన్ని ఉంచే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close