నరసింహన్ మర్చిపోలేదు..! పాతికవేల విరాళం పంపారు..!

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా.. ఆ తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్‌గా.. ఆ తర్వాత తెంలగాణ గవర్నర్‌గా సుదీర్ఘ కాలం పని చేసిన నరసింహన్‌.. పదవీ కాలం పూర్తయిన తర్వాత తమిళనాడులో స్థిరపడ్డారు. పదవిలో ఉన్నప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల అత్యంత ఆదరణ చూపిన ఆయన ఇప్పుడు… కూడా మర్చిపోలేదు. హైదరాబాద్ వరదల విషయంలో తెలంగాణ సర్కార్ విమర్శలు ఎదుర్కొంటోందని అనుకున్నారేమో కానీ.. రంగంలోకి వచ్చేశారు. చాలా రోజుల తర్వాత ఆయన తరపు నుంచి నుంచి ఓ ప్రకటన వచ్చింది. హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితిపై ఆందోళన చెందినా… బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందిస్తూ ఆయన ప్రకటన జారీ చేశారు.

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. సహాయ కార్యక్రమాల కోసం తనవంతు సహాయంగా తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి 25 వేలు సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ఇచ్చారు. నరసింహన్‌ స్పందనకు కేసీఆర్ కూడా ఫిదా అయ్యారు. కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ పిలుపుమేరకు పెద్ద ఎత్తున తెలంగాణ సర్కార్‌కు విరాళాలు ప్రకటిస్తున్నారు. మేఘా కంపెనీ పది కోట్లు… మహా గ్రూప్ కంపెనీ ఐదు కోట్లు విరాళాలు ప్రకటించాయి. మరికొంత మంది వ్యక్తిగతంగానూ విరాళాలు ప్రకటిస్తున్నారు. నరసింహన్ స్వల్ప మొత్తమే ఇచ్చినా… కేసీఆర్‌ను సంతోషపరిచింది.

ప్రభుత్వం గురించి మంచి మాటలు చెప్పడమే దానికి కారణం కావొచ్చు. కారణం ఏదైనా… తెలంగాణ ఉద్యమం పీక్స్‌లో ఉన్నప్పుడు.. గవర్నర్‌గా వచ్చిన నరసింహన్ మొదట్లో…. ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close