ఏపీలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఖర్చైపోతారు..!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కాలంటే.. ట్రాఫిక్ రూల్స్‌పై సమగ్రమైన అవగాహన ఉండాలి. లేకపోతే..బండి ఖరీదు కన్నా ఎక్కువ ఫైన్ కట్టాల్సి రావొచ్చు. అనూహ్యంగా… రవాణా శాఖ … జరిమానాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బైక్‌ నుంచి 7 సీటర్‌ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా ఉంటుంది. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, డేంజరస్‌ డ్రైవింగ్‌ చేస్తే రూ. 10 వేల ఫైన్‌ వేస్తారు. రేసింగ్‌ పాల్పడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు ఫైన్‌, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు వసూలు చేస్తారు.

వాహనాలకు పర్మిట్‌ లేకపోతే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, వాహన బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40 వేలు ఫైన్ వేస్తారు. అలాగే ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు వసూలు చేస్తారు. అంతటితో అవలేదు.. అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు వడ్డిస్తారు. ఓవర్ స్పీడ్‌కు రూ. వెయ్యి ఖరారు చేశారు. ఈ జరిమానాలూ చూసి వాహనదారులకు కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా ఆటోవాలాల నుంచి రవాణా శాఖ ఫైన్లను వసూలు చేస్తూంటుంది.

అన్ని రకాల నిబంధనలతో ఆటోలు నడపడం అనేది అసాధ్యమని ఆటో రంగంలో ఉన్న వారు చెబుతూంటారు. రవాణా శాఖ అధికారులు వసూలు చేయాలంటే.. ఏదో ఓ వంక పెట్టి ఫైన్ వేయగలరు. ఇదే ఇప్పుడు.. ఏపీలో వాహనదారుల్ని భయపెడుతోంది. వివిధ పథకాల కింద.. ప్రజలక ుఇస్తున్న డబ్బులను పెట్రోల్ రేట్లను పెంచడం ద్వారా… ఫైన్లు వేయడం ద్వారా వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close