వాళ్ల పేర్లు చెప్పి మోసం చేసేవాళ్లు ఎక్కువై పోయారు..!

వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారికి విచిత్రమైన సమస్యలు వస్తున్నాయి. వారి పేర్లతో వేరే ఎవరో దందాలు చేస్తున్నారు. విషయం తెలిసే సరికి కొంత మంది మోసపోతున్నారు. చివరికి వారు తమకేం సంబంధం లేదంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలాంటి వాటిలో తాజా బాధితుడు.. కల్లం అజేయరెడ్డి అలియాస్ అజయ్ కల్లాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉన్న ఆయన పేరు చెప్పి కొంత మంది ఉద్యోగాలు.. కాంట్రాక్టులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా డబ్బులు ఇచ్చిన కొంత మంది గురించి అజేయకల్లాంకు తెలియడంతో మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. ఆయన తన పేరుతో మోసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.

కొద్ది రోజుల కిందట.. ఇదే సమస్య.. మరో కీలక అధికారిగా ఉన్న పీవీ రమేష్‌కు కూడా ఇలాంటి చిక్కులు వచ్చాయి. అయితే ఆయన పేరును వాడుకున్నది ఎవరో చిల్లర దొంగలు కాదు. నేరుగా నూతన్ నాయుడే వాడేసుకున్నారు. ఆయన పేరు వాడుకుని.. శిరోముండనం కేసు నుంచి బయటపడాలనుకున్నారు. విషయం తెలియడంతో ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇతర కేసులతో పాటు … పీవీ రమేష్ పేరును వాడుకున్న కేసు కూడా.. నూతన్ నాయుడు పై నమోదయింది. వీరిద్దరు అధికారులే… నేరుగా స్పీకర్ పేరును ఉపయోగిస్తూ.. మరికొంత మంది దందాలు చేశారు. ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది.

స్పీకర్ పేరుతో నేరుగా సెక్రటేరియట్‌లోనే ఓ వ్యక్తి దందాలు చేస్తున్నారని.. అతనితో స్పీకర్‌కు సంబంధం లేదని… స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇలా వరుసగా… ప్రభుత్వంలో కీలకంగా ఉండే వారి పేర్లను ఉపయోగించుకుని ఉద్యోగాలు.. కాంట్రాక్టుల పేరుతో… ఇతరుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నేరాలు పెరిగిపోవడం.. వైసీపీ వర్గాల్లో సైతం చర్చనీయాంశం అవుతోంది. ఇలాంటి కేసులు ఇంకెన్ని బయటకు వస్తాయోనన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close