వాళ్ల పేర్లు చెప్పి మోసం చేసేవాళ్లు ఎక్కువై పోయారు..!

వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారికి విచిత్రమైన సమస్యలు వస్తున్నాయి. వారి పేర్లతో వేరే ఎవరో దందాలు చేస్తున్నారు. విషయం తెలిసే సరికి కొంత మంది మోసపోతున్నారు. చివరికి వారు తమకేం సంబంధం లేదంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలాంటి వాటిలో తాజా బాధితుడు.. కల్లం అజేయరెడ్డి అలియాస్ అజయ్ కల్లాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉన్న ఆయన పేరు చెప్పి కొంత మంది ఉద్యోగాలు.. కాంట్రాక్టులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా డబ్బులు ఇచ్చిన కొంత మంది గురించి అజేయకల్లాంకు తెలియడంతో మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. ఆయన తన పేరుతో మోసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.

కొద్ది రోజుల కిందట.. ఇదే సమస్య.. మరో కీలక అధికారిగా ఉన్న పీవీ రమేష్‌కు కూడా ఇలాంటి చిక్కులు వచ్చాయి. అయితే ఆయన పేరును వాడుకున్నది ఎవరో చిల్లర దొంగలు కాదు. నేరుగా నూతన్ నాయుడే వాడేసుకున్నారు. ఆయన పేరు వాడుకుని.. శిరోముండనం కేసు నుంచి బయటపడాలనుకున్నారు. విషయం తెలియడంతో ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇతర కేసులతో పాటు … పీవీ రమేష్ పేరును వాడుకున్న కేసు కూడా.. నూతన్ నాయుడు పై నమోదయింది. వీరిద్దరు అధికారులే… నేరుగా స్పీకర్ పేరును ఉపయోగిస్తూ.. మరికొంత మంది దందాలు చేశారు. ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది.

స్పీకర్ పేరుతో నేరుగా సెక్రటేరియట్‌లోనే ఓ వ్యక్తి దందాలు చేస్తున్నారని.. అతనితో స్పీకర్‌కు సంబంధం లేదని… స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇలా వరుసగా… ప్రభుత్వంలో కీలకంగా ఉండే వారి పేర్లను ఉపయోగించుకుని ఉద్యోగాలు.. కాంట్రాక్టుల పేరుతో… ఇతరుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నేరాలు పెరిగిపోవడం.. వైసీపీ వర్గాల్లో సైతం చర్చనీయాంశం అవుతోంది. ఇలాంటి కేసులు ఇంకెన్ని బయటకు వస్తాయోనన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close