ఐదేళ్లు : రాజకీయ కుట్రల్లో నలిగిపోతున్న అమరావతి..!

ఐదేళ్ల క్రితం..ఇదే రోజు. రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం. రాజధాని లేని రాష్ట్రానికి ఓ రాజధానిని నిర్మించుకుంటున్నఆనందం.. రాష్ట్రం మొత్తం కనిపిస్తోంది. ఎక్కడా… ప్రాంతీయ విబేధాలు లేవు. అందరూ.. మనస్ఫూర్తిగా రాజధానిని స్వాగతించారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా స్వాగతించారు. ప్రధాని చేతుల మీదుగా .. అంగరంగ వైభవంగా ఆ ఉత్సవం సాగింది. ప్రపంచంలో మేటి రాజధాని కావాలని మోడీ ఆశీర్వదించారు. కానీ ఇప్పుడేమయింది..?. దీనికి ఎవరు కారణం..?

ఆ వేగంతో నిర్మాణాలు కొనసాగి ఉంటే గ్రాఫిక్స్ నిజమయ్యేవి.. !

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా రాజధానిని నిర్ణయించి.. భూసమీకరణ చేసి.. శంకుస్థాపన చేసే సమయానికి పదహారు నెలలు గడిచింది. అప్పుడే కొంత మంది ఎన్టీటీలో పిటిషన్లు వేశారు. ఆ కారణంగా కొండవీడు ఎత్తిపోతల నిర్మించిన తర్వాతే రాజధాని నిర్మాణం చేపట్టాలని ఎన్జీటీ ఆదేశించింది. ఆ ఆదేశాలతో శరవేగంగా ఎత్తిపోతల నిర్మించారు. నిర్మాణాలు ప్రారంభించేసరికి..మరో ఏడాదిగడిచిపోయింది. ఆ తర్వాత రెండున్నరేళ్లలోనే… అమరావతి ఓ రూపానికి వచ్చింది. ఇప్పుడు.. అమరావతిలో కనించేవన్నీ.. అకొద్ది కాలంలో నిర్మించినవే. ఆ వేగంతో కొనసాగించి ఉంటే.. ఈ పాటికి అమరావతికి ఓ రూపానికి వచ్చేది.. ప్రజారాజధానిగా.. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉండేది. కానీ ఇప్పుడా ఆశల సౌధం కుప్పకూలిపోయింది. కొత్త ప్రభుత్వం ఆమరావతి ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నంలో బిజీగా ఉంది. స్వయం నాశనం అనే పదానికి విస్తృతమైన అర్థం తెలియచెబుతున్నారు.

నాడు బాసలు చేసిన మోడీ నేడు వ్యూహం మార్చుకున్నారు..!

అమరావతి రాజధానికి ప్రధానమంత్రి మోడీ వచ్చారు. ఢిల్లీ నుంచొచ్చిన ఆయన ప్రజాస్వామ్యానికి మందిరం వంటి పార్లమెంట్ వద్ద సేకరించిన పవిత్ర మట్టిని తీసుకొచ్చానని, మన సంస్కృతికి, నాగరికత లకు ప్రతిబింబాలు మన నదులు అని పేర్కొన్నారు. అందుకే పవిత్ర యమునా నది నుంచి పవిత్ర జలాన్ని తెచ్చానని ప్రధాని ప్రకటించారు. ఢిల్లీని తలదన్నే విధంగా ఏపీ రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రధాని మోడీ ఐదు కోట్ల ఆంధ్రులకు ఆనాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ సర్కార్ పనులకు మద్దతు పలుకుతున్నారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేదంటున్నారు. అధికార పార్టీతో రాజకీయ ప్రయోజనాల కోసం లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని… దేశానికే నష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు చెప్పినా కేంద్రం చెవికెక్కించుకోవడం లేదు.

సొంత రాజధానిపై కుట్రలు చేసుకునే మేధావులు ఆంధ్రులు..!

అమరావతిపై ఓ ముద్ర వేసి.. రాజకీయ ప్రయోజనాలు సాధించేశారు స్వార్థ రాజకీయ నాయకులు. దేశంలో ఏ రాజధానిపైనా వేయని నిందలు వేశారు. అది కూడా సొంత ప్రజల్ని మభ్య పెట్టి. ఇతర రాష్ట్రాలు.. ఇతర దేశాలు అభివృద్ధి కోసం.. కలసి కట్టుగా ప్రయత్నిస్తాయి.. కానీ ఏపీలో మాత్రం.. కులం, ప్రాంతాలను బూచిగా చూపి.. ఒకరి ఆర్థిక పునాదుల్ని మరొకరు కూల్చుకుంటూ ఉంటారు. ఆక్రమంలో అమరావతి నిర్వీర్యమైపోయింది. భావి ఆంధ్రుల పిల్లలకు బంగారు భవిష్యత్ కనుమరుగయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close