మనది జీవన్మరణ పోరాటం : మోడీ

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచంలో కొన్ని దేశాలు పడుతున్న ఇబ్బందుల్ని చూసిన తర్వాతనే.. లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నామని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఆయన ఆల్ ఇండియా రేడియోలోని ఆయన ప్రసంగం కార్యక్రమం మన్‌కీ బాత్ లో మొత్తం ఈ అంశంపైనే మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని.. జీవన్మరణ పోరాటంలో గెలవాల్సిన అవసరం ఉందన్నారు. రోజు కూలీలు పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనని.. తనను క్షమించాలని నిర్మోహమాటంగా కోరారు.

లాక్‌డౌన్ ఎవరినో రక్షించడానికి కాదని.. ప్రజలు తమను తాము రక్షించుకుంటూ.. తమ కుటుంబాన్ని కూడా కాపాడుకోవడానికేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జీవన్మరణ పోరాటం చేస్తున్నామని మోడీ ప్రకటించారు. కొంత మంది నాన్ సీరియస్‌గా ఊంటూ రోడ్ల మీదకు వస్తున్న విషయంపై.. కూడా మోడీ స్పందింారు. వైరస్ ఎ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదని.. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా… ఇతరులకు ఇబ్బందేనని మోడీ అన్నారు. వైరస్‌కు పేద, ధనిక తేడా ఉండదని.. కరోనాపై మనం చేస్తున్న యుద్ధం గెలిచి తీరాల్సిందేనన్నారు. ప్రభుత్వం విధించిన లక్ష్మణరేఖను ఎవరూ దాటొద్దని స్పష్టం చేశారు. కరోనాకు మందు లాక్ డౌన్ మాత్రమేనని స్పష్టం చేశారు.

అందరూ ఏకమై కరోనాపై యుద్ధం చేయాలని పిలుపు ఇచ్చారు. లక్ష్మణరేఖను కొన్నాళ్ల పాటు దాటవద్దని హెచ్చరికలు చేశారు. నరేంద్రమోడీ తన ప్రసంగంలో .. కరోనా కారణంగా నిర్విరామంగా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది.. అత్యవసర సేవల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close