మిషన్ తెలంగాణ… ఈ సారి మూడు రోజులు మోదీ మకాం ! !

తెలంగాణలో అధికారం చేపట్టడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్‌ను ఫ్రస్ట్రేషన్‌కు గురి చేస్తూ ఇప్పటికే అనేక రకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలోనే నిర్వహించాలని నిర్ణయించారు. జులై నెలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. మూడు రోజల పాటు హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.

ఈ సమావేశాల కోసం ప్రధాని మోదీ, అమిత్ షా మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తే దేశం మొత్తం చూపు తెలంగామ వైపే ఉంటుంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీని దెబ్బకొట్టాలని ఒకరి రెండు నెలల్లో సంచలనం నమోదు చేస్తానని కేసీఆర్ చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించడమే సంచలనంగా చాలా మంది భావిస్తున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ వచ్చే నెలకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో కానీ… తెలంగాణలోనే మకాం వేస్తామని మోదీ, అమిత్ షా నేరుగా కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు. బీజేపీకి కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. దేశం మొత్తం తెలంగాణలో బీజేపీ వైపు చూస్తూంటే… ఆ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకునేలా కేసీఆర్ రాజకీయం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close