తెలుగు రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ఒకానొకప్పుడు తెలుగు ప్రజల ఇళ్ళను టీవీలు ఆక్రమించక ముందు రాష్ట్రమంతటా సాహిత్య పరిమళాలు గుబాళించేవి. అనేక మంది రచయితలు పోటీలు పడి మరీ రచనలు చేస్తుంటే వాటిని తెలుగు ప్రజలు చదవి తనివితీరా ఆస్వాదించేవారు. పత్రికా రంగం కూడా మూడు పూవులు ఆరు కాయలుగా సాగేది. తెలుగు సినిమాలలో సైతం ఆ సాహిత్య పరిమళాలు విరజిమ్మేవి. తెలుగు ప్రజల సాహిత్యభిరుచి ఎంతగా ఉండేది అంటే వారు వ్రాసుకొనే సాధరణమయిన ఉత్తరాలలో కూడా సాహిత్య ప్రసక్తి కనబడుతుండేది. తెలుగు సాహిత్యానికి అదొక స్వర్ణ యుగం. ఆ స్వర్ణ యుగంలోనే ఓల్గా కూడా తన సాహిత్యంతో తెలుగు ప్రజలను ఓలలాడించారు.ఆమె కలం నుండి జాలువారిన సజజ, కన్నీటి కెరటాల వెన్నెల, ఆకాశంలో సగం వంటి నవలలు, రాజకీయ కధలు, ప్రయోగం వంటి కధలు, వాళ్ళు ఆరుగురు వంటి నాటికలు, కవితలు, కధానికలు, అనువాద కధలతో తెలుగు ప్రజలను మెప్పించారు.

ఆమె రచించిన విముక్త అనే కధా సంపుటికి 2015సం.కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపిక చేసారు. ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఓల్గా అనేది ఆమె కలం పేరు. కానీ ఆమె ఓల్గాగానే ప్రజలకు, సాహితీ అభిమానులకు సుపరిచితులు. ఆమె నవంబర్‌ 27, 1950న గుంటూరులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేసి తెనాలిలో వీఎస్‌ఆర్‌-ఎన్‌వీఆర్‌ కళాశాలలో 1973 నుంచి 86 వరకు అధ్యాపకురాలిగా పనిచేశారు. 1986 నుంచి సుమారు ఎనిమిదేళ్ళపాటు సినీ రంగంలో కూడా పనిచేసారు. అస్మిత అనే స్వచ్చంద సంస్థతో కలిసి మహిళల సమస్యలు, హక్కుల కోసం పోరాడారు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగు విభాగానికి సలహాదారుగా సేవలు అందించారు. ఆమె ఒక మంచి రచయితగా, మానవతావాదిగా, ఉద్యమకర్తగా ప్రజలకు సుపరిచితులు. ఆమె రచించిన స్వేచ్చ, ఆకాశంలో సగం నవలలకు ఉత్తమ నవలలుగా అవార్డులు అందుకొన్నారు. ‘తోడు’ అనే సినిమాకు ఆమె అందించిన కధకు 1997లో నంది అవార్డు అందుకొన్నారు. ఇంకా అనేక అవార్డులు, సాహితీ సన్మానాలు పొందారు. నేడు సాహితీ రంగంలో కెల్లా అత్యన్నత పురస్కారమయిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపిక అవడం సాహితీ ప్రియులు అందరికీ చాలా సంతోషం కలిగించే విషయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close