దేశవ్యాప్తంగా జనగణన ఎప్పుడు జరుగుతుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. 2027 మార్చి 1నుంచి కొత్త జనగణన నిర్వహించనున్నట్లు వెల్లడించింది కేంద్రం. అయితే, ఈసారి జనగణనతోపాటు కుల గణన కూడా చేపట్టనుంది. ఇదివరకు కేంద్ర కేబినేట్ కుల గణనకు ఆమోదం తెలపడంతో ఈసారి కొత్తగా కులగణన కూడా జరగనుంది.
2027నుంచి కుల గణన చేపట్టనున్నట్లు ప్రకటించిన కేంద్రం… రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో 2026నుంచే ఈ లెక్కింపు ప్రారంభం కానుంది. మొదటి దశలో హిమాచల్ ప్రదేశ్ , జమ్మూ – కాశ్మీర్ , ఉత్తరాఖండ్, లద్దాఖ్ , కేంద్ర పాలిత ప్రాంతాల్లో వచ్చే ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభం కానుంది.
చివరిసారిగా ఈ జన గణన లెక్కలు 2011లో నిర్వహించబడ్డాయి. నిబంధనల ప్రకారం 2021లో ఇది జరగాల్సినప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా లెక్కింపు వాయిదా పడింది. జన గణన చేపట్టేందుకు చేయాల్సిన ముందస్తు కసరత్తుకూ ఆటంకం ఏర్పడింది. దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జనాభా లెక్కలు చేపట్టబోతున్నారు.
30కి పైగా ప్రశ్నలతో కూడిన ప్రాథమిక సర్వే ఫారమ్ను సిద్ధం చేసినట్టు తెలుస్తింది. ఈ జనగణన ముగిసిన వెంటనే జనాభా దామాషా ప్రకారం లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల్లోని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలోనూ మార్పు రానుంది. అయితే, ఈసారి దక్షిణాది రాష్ట్రాలు 26లోక్ సభ సీట్లు కోల్పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.