బాల‌కృష్ణ‌కు ద‌ర్శ‌కుడు దొరికేశాడు

మోక్ష‌జ్ఞ రీ ఎంట్రీ గురించి నంద‌మూరి అభిమానులు సుదీర్ఘ‌కాలంగా నిరీక్షిస్తూనే ఉన్నారు. బాల‌య్య కూడా `వ‌స్తాడు.. వ‌స్తాడు` అంటూ ఊరిస్తూనే ఉన్నాడు. కానీ అదెప్పుడో తేల‌డం లేదు. బోయ‌పాటి శ్రీ‌ను, క్రిష్‌, సింగీతం శ్రీ‌నివాస‌రావు – ఇలా చాలా మంది పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. వాళ్ల‌తో ఒక‌రు మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని చెప్పుకున్నారు. కానీ ఆ ఆలోచ‌న‌ల‌న్నీ అట‌కెక్కేశాయి. మోక్ష‌జ్ఞ ఎంట్రీ 2020లో లేన‌ట్టే. 2021లో వ‌స్తాడ‌నుకుంటే… ఓ ద‌ర్శ‌కుడు మోక్షుతో సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్నాడు. త‌నే… అనిల్ రావిపూడి.

వ‌రుస విజ‌యాల‌తో సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు త‌న దృష్టంతా పెద్ద హీరోల‌పైనే ఉంది. అయితే ఓ ద‌శ‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే ఛాన్స్ వ‌చ్చింది `రామారావుగారు` అనే క‌థ‌ని సిద్ధం చేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి. అయితే అది కార్య‌రూపం దాల్చ‌లేదు. కాక‌పోతే ఇప్ప‌టికీ బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి రెడీగానే ఉన్నాడు అనిల్ రావిపూడి. కుదిరితే బాల‌య్య‌తో ప‌నిచేస్తాన‌ని, మోక్ష‌జ్ఞ‌తోనూ సినిమా చేయాల‌ని ఆశ ప‌డుతున్నాన‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు అనిల్ రావిపూడి. బాల‌య్య సంగ‌తేమో గానీ… మోక్ష‌జ్ఞ‌ని అనిల్ రావిపూడి చేతిలో పెడితే… సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్టే. ఎందుకంటే… అస‌లు ఫ్లాప్ అనే మాట ఇప్ప‌టి వ‌ర‌కూ ఎర‌గ‌లేదు అనిల్‌. క‌నీసం మినిమం గ్యారెంటీ సినిమా తీసిపెట్ట‌గ‌ల‌డు. పైగా అనిల్ – మోక్ష‌జ్ఞ కాంబో అంటే క్రేజ్ మ‌రింత బాగుంటుంది. సో… మోక్ష‌జ్ఞ కోసం బాల‌య్య‌కు ద‌ర్శ‌కుల్ని వెదికే ప‌ని త‌ప్పింది. కాక‌పోతే మోక్ష‌జ్ఞ‌నే కాస్త రెడీ చేయాలి. బాల‌య్యా… ఆ ప‌నిలో ఉండండి మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close