కూటమిలో సీట్లు, అభ్యర్థుల మార్పులు !

అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఏర్పడిన పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల సీట్లు, అభ్యర్థులను మార్పు చేసేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రఘురామకు సీటు కేటాయించడం ఖాయమయింది. అందు కోసం ఏదో ఓ చోట మార్చాల్సి వస్తోంది. ఏలూరు సీటు బీజేపీకి ఇచ్చి.. నర్సాపురంను టీడీపీకి ఇచ్చే విషయంపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని స్థానాలపై కసరత్తు ప్రారంభమయింది.

ఆనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అత్యంత బలహీనమైన అభ్యర్థి. ఆయన ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సీటులో టీడీపీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పట్టుదలకు పోయి ఓడిపోవడం కన్నా.. టీడీపీ నుంచి రామకృష్ణారెడ్డి పోటీ చేయడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది. ఆయన బీజేపీ నుంచి పోటీ చేయమన్న ప్రతిపాదన వచ్చినా.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించలేదని చెబుతున్నారు.

అనకాపల్లి జిల్లా ఎంపీ స్థానం పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు కోసం సీఎం రమేష్ పట్టుబడుతున్నారు. యలమంచిలి, మాడుగుల స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చాలని కోరుతున్నారు. మాడుగులలో టీడీపీ అభ్యర్థి పైలా ప్రసాద్ గట్టిగా ప్రయత్నించలేకపోతున్నారని ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలన్న ప్రతిపాదన సీఎం రమేష్ పెట్టారు. అదే సమయంలో యలమంచిలిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్ స్పీడ్ అందుకోలేకపోతున్నారని.. ఆయనకు బదులుగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదన కూడా రమేష్ పెట్టారు. వీటిపై ఒకటి, రెండు రోజుల్లోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close