నెల్లూరు వైఎస్ఆర్సీపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక్కరంటే ఒక్క నేత కూడా యాక్టివ్ గా లేరు. అందరూ సైలెంట్ అయిపోయారు. గతంలో ప్రెస్మీట్లు పెట్టే కాకాణి గోవర్ధన్ రెడ్డి మూడు నెలల పాటు పరారీలో ఉండి ఇప్పుడు జైలుకెళ్లారు. అదాల ప్రభాకర్ రెడ్డి నుంచి అనిల్ కుమార్ యాదవ్ వరకూ అందరూ నోటికి ప్లాస్టర్లేసుకున్నారు. ఒక్కరూ మాట్లాడటం లేదు. బయటకు రావడం లేదు.
దీంతో క్యాడర్ హాహాకారాలు పెడుతోంది. జగనన్నా.. మాకు దిక్కెవరన్నా అని .. ఫ్లెక్సీలు వేస్తున్నారు. కావలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అక్కడి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై క్యాడర్ పైర్ అవుతున్నారు. ఇంత కాలం దోచుకుని మమ్మల్ని రోడ్డున పడేసిపోయారని ఆరోపించారు. వారంతా కలిసి తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారు.
నెల్లూరులో గతంలో వైసీపీ అత్యంత బలంగా ఉండేది. 2019లో అన్ని సీట్లు గెల్చుకున్నారు. మేకపాటి, ఆనం, అనిల్ కుమార్, కోటంరెడ్డి ఇలా అందరూ బలమైన లీడర్లు ఉండేవారు. కానీ 2024కి మొత్తం తేడా వచ్చేసింది. ఒక్క సీటు కూడా మిగల్లేదు. ఒక్క నాయకుడు కూడా మిగలడం లేదు. చివరికి మాకు దిక్కెవరన్నా అని పోస్టర్లు వేసుకోవాల్సి వస్తోంది. అయినా పట్టించుకునేవారే లేరు.