“బాక్సైట్” మైనింగ్‌పై ఎన్జీటీ కఠిన చర్యలు..! కానీ …

తూర్పుగోదావరి. విశాఖ మన్యం ప్రాంతాల్లో కొంత కాలంగా బాక్సైట్ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వి తీసుకెళ్తున్నారని దీని కోసం రక్షిత అటవీ ప్రాంతంలో రోడ్డు కూడా వేశారని విపక్ష నేతలు ఆరోపించారు. వారు వెళ్లి అడవిలో పరిశీలన చేసి వచ్చే సమయంలో పోలీసులు అరెస్టులు కూడా చేశారు. ఇప్పుడీ అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో పిటిషన్ దాఖలు కావడంతో… విచారణ జరిపిన ఎన్జీటీ.. కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌పై విచారణ కమిటీని నిమయమించింది. మైనింగ్‌ పేరుతో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా ఎన్జీటీ నిర్ధారరణకు వచ్చింది.

అనుమతించిన పరిధి దాటి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్‌ చేశారని గుర్తించింది. అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, పీసీబీ అధికారులు, విశాఖ కలెక్టర్‌ సభ్యులుగా ఉండనున్నారు. అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రాంతంలో పర్యటించి మైనింగ్‌ అనుమతులు, పరిధి, రోడ్డు నిర్మాణం, అక్రమ మైనింగ్‌పై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.

అయితే కమిటీ ఆదేశాలు చాలా కఠినంగా ఉన్నాయి కానీ అమలు చేయాల్సింది ఏపీ ప్రభుత్వం. ఎన్జీటీని ఏపీ ప్రభుత్వం పట్టించుకుంటున్న సూచనలు లేవు. ఇటీవల.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో తనిఖీలు చేయాలని ఆదేశించినా ఏపీ సర్కార్ సహకరించలేదు. ఇప్పుడు మైనింగ్ విషయంలోనూ.. ఏపీ అధికార పార్టీకి చెందిన వారిపైనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈఆదేశాలను ఆయినా ప్రభుత్వం పాటిస్తుందో లేదో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close