ఎన్జీటీ దృష్టిలో జన్వాడ్ ఫామ్‌హౌస్‌ను పెట్టిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులు జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిగా ఆయనకు ప్రభుత్వ వ్యవహారాల్లో భాగంగా నోటీసులు రాలేదు. వ్యక్తిగతంగా.. జన్వాడ గ్రామంలో నిర్మించిన ఫామ్‌హౌస్ విషయంలో ఈ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. జన్వాడ ఫామ్‌హౌస్‌ను.. జీవో నెంబర్ 111కి విరుద్ధంగా.. పర్యావరణ నిబంధనలకు ఉల్లంఘించి కట్టారని ఆరోపిస్తూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు ఫిర్యాదు చేయడమే. జన్వాడ గ్రామంలో కేటీఆర్‌కు ఓ ఫామ్ హౌస్ ఉంది. కరోనా లాక్ డౌన్ కంటే ముందుగా.. రేవంత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ విషయాన్ని మీడియాను తీసుకెళ్లి వివరించారు. అప్పట్లో ఆయన ఫామ్‌హౌస్‌పై.. డ్రోన్ ఎగరవేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టారు. పది రోజుల పాటు ఆయనకు బెయిల్ దక్కలేదు.

అయితే.. ఆయన ఆ తర్వాత కూడా ఆ అంశాన్ని వదిలి పెట్టలేదు. ఖచ్చితంగా జన్వాడ ఫామ్‌హౌస్ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. ఎన్జీటీకి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్జీటీ స్పందించింది. కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం, పీసీబీ, హెచ్ఎండీలకు కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే.. ఓ నిజాల్ని నిర్ధారించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సెంట్రల్ ఎన్విరాన్‌మెంట్ రిజిస్ట్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. వీరు రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది.

జన్వాడ గ్రామం జీవో నెంబర్ 111 పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్‌కు నీరు అందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు నీరు చేరే క్రమంలో అడ్డంకులు ఏర్పడకుండా.. శాశ్వత నిర్మాణాలు కట్టకుండా.. ఆ జీవో పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షల్ని ఉల్లంఘించి కేటీఆర్ భారీ ఫామ్‌హౌస్ నిర్మించారని.. రేవంత్ రెడ్డి ఆరోపణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close