వైసీపీ వైపు సీపీఎం.. ఎన్నికల వైపు మిగతా పార్టీలు..!

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీల అభిప్రాయాలు సేకరించారు. అధికార పార్టీ వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. హాజరైన పార్టీల్లో ఒక్క సీపీఎం మినహా మిగిలిన అన్ని పార్టీలు దాదాపుగా ఒకే వాదన వినిపించాయి. ఎన్నికలు పెట్టాలని..మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ నిర్వహించాలని కోరాయి. తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రక్రియను.. మొదటి నుంచి కేంద్ర బలగాల భద్రతతో నిర్వహించాలని ఎస్‌ఈసీని కోరింది. గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటి వరకూ స్థానిక ఎన్నికలపై బయట పెద్దగా మాట్లాడని బీజేపీ కూడా.. తన అభిప్రాయం.. ఎన్నికల వైపేనని చాలా స్పష్టంగా చెప్పింది. అదీ కూడా మళ్లీ ప్రక్రియ మొదటి నుంచి చేపట్టాలని కోరింది.

బహుజన్ సమాజ్ పార్టీ ప్రతినిధులదీ కూడా అదే మాట. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సీపీఐ కూడా… ఎన్నికలు పెట్టాలని.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలిని లేఖ రూపంలో వినతి పత్రం ఇచ్చింది. జనసేన పార్టీ.. తన ప్రతినిధిని పంపలేదు. కానీ ఈ మెయిల్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియచేసింది. ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపింది. అయితే సీపీఎం మాత్రం.. ఈ విషయంలో… కాస్త వైసీపీకి దగ్గరైన వాదన వినిపించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పిన ఆ పార్టీ ప్రతినిధులు.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని కోరారు.

పార్టీల అభిప్రాయాలన్నింటినీ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. వచ్చే నెల నాలుగో తేదీన.., స్థానిక ఎన్నికలకు సంబంధించిన కేసు విచారణ జరగనుంది. గత విచారణలో.. పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు.. నిమ్మగడ్డ… ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close